మోడీ సౌదీ పర్యటనకు క్యార్ తుఫాను ముప్పు... విమానం ఆ రూట్లో వెళ్లగలదా..?
పాకిస్తాన్ తన బుద్ధిని ఇసుమంతైనా మార్చుకోలేదు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనకు వెళుతున్నారు. ఇందుకోసం పాకిస్తాన్ గగనతలం మీదుగా విమానం ప్రయాణిస్తే తక్కువ సమయంలో సౌదీకి చేరుకుంటారు. కానీ మోడీ విమానం తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి నిరాకరించింది పాకిస్తాన్. దీంతో మోడీ బోయింగ్ విమానం 747 ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో విమానం ఇంధనం, సమయం కూడా వృథా కానుంది.
మోడీ విమానం ఎగిరేందుకు అనుమతి ఇవ్వని పాక్
ప్రధాని నరేంద్రమోడీ విమానం పాకిస్తాన్ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కొత్త రూట్లో ప్రయాణించనుంది. ఢిల్లీ నుంచి ముంబైకి దగ్గరగా వెళ్లి ఆ పై అరేబియా సముద్రం మీదుగా టర్న్ తీసుకుని రియాద్ వైపు వెళ్ళనుంది. అయితే అరేబియన్ సముద్రంలో క్యార్ తుఫాన్ ప్రభావం ఉన్నందున ఫ్లైట్ ప్లాన్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.
విమానంకు క్యార్ తుఫాను ముప్పు
ఒకవేళ
పాకిస్తాన్
గగనతలం
మీదుగా
విమానం
ఎగిరి
ఉంటే
క్యార్
తుఫాను
ముప్పు
ఉండేది
కాదు.
ముంబై
మీదుగా
అయితే
క్యార్
తుఫాను
ముప్పు
ఉంటుందని
ఏవియేషన్
అధికారులు
చెబుతున్నారు.
ముంబైలోని
అరేబియా
సముద్రం
మీదుగా
వెళుతుందంటే
సౌదీకి
చేరుకునేందుకు
45
నిమిషాలు
అదనంగా
సమయం
తీసుకుంటుందని
చెప్పారు.
భారత
ప్రధాని
నరేంద్ర
మోడీ
విమానం
తమ
గగనతలంలో
ఎగిరేందుకు
అనుమతి
నిరాకరిస్తున్నట్లు
పాకిస్తాన్
ఆదివారం
వెల్లడించింది.
ఫ్లయిట్ ప్లాన్ మారే అవకాశం..?
భారత వాతావరణశాఖ నివేదిక ఇచ్చిన ప్రకారం క్యార్ తుఫాను క్రమంగా ఒమన్ తీరంవైపు కదులుతోంది. ముంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు మహారాష్ట్ర, కర్నాటక, గోవాల్లో కురుస్తాయని పేర్కొంది. ముంబై నైరుతీ తీరానికి 580 కిలోమీటర్ల దూరంలో క్యార్ తుఫాను కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి అనుగుణంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణించే ఫ్లయిట్ ప్లాన్ ఉంటుంది. ఇక సోమవారం రియాద్లో ప్రధాని మోడీ ల్యాండ్ అవుతారు. పర్యటనలో సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్తో భేటీ అవుతారు. ఆ తర్వాత మంగళవారం జరిగే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ ఫోరంలో పాల్గొంటారు.
రాష్ట్రపతి విమానంను కూడా అడ్డుకున్న పాక్
ఇదిలా
ఉంటే
ఆర్టికల్
370
రద్దు
తర్వాత
భారత్
పట్ల
కక్షపూరితంగా
వ్యవహరిస్తున్న
పాకిస్తాన్
రాష్ట్రపతి
రామ్నాథ్
కోవింద్
విదేశీ
పర్యటన
సందర్భంలో
కూడా
ఆయన
ప్రయాణించాల్సిన
విమానం
తమ
గగనతలంలో
ఎగిరేందుకు
అనుమతి
నిరాకరించింది.
ఆ
తర్వాత
ప్రధాని
అమెరికా
పర్యటన
సందర్భంగా
కూడా
తమ
గగనతలంలో
విమానం
ఎగిరేందుకు
పాక్
నిరాకరించింది.