బాలాకోట్ దాడిపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి మోదీ వివరణ .. వాయుసేనకు కేజ్రీవాల్ సెల్యూట్
ఢిల్లీ : పీవోకేలో నక్కిన జైషే మహ్మద్ శిబిరంతో దాడితో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. బుధవారం ఉదయం 3.30 గంటలకు జరిగిన దాడిని ఎయిర్ ఫోర్స్ అధికారులు ధృవీకరించారు. తర్వాత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ కూడా దాడుల గురించి మీడియాకు వివరించారు.
రాష్ట్రపతి, ప్రధానికి తెలిపిన ప్రధాని
భారత వాయుసేన చేపట్టిన దాడుల అంశాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వివరించారు ప్రధాని మోదీ. సరిహద్దులో మరిన్ని ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో రంగంలోకి దిగినట్టు వివరించారు.
సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశం
పుల్వామా దాడికి ధీటుగా భారత సైన్యం ప్రతిస్పందించింది. ఈ నేపథ్యంలో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో భారత ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించార ప్రధాని మోదీ. ఇటు సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్ తెలిపారు.
భళా .. వాయుసేన
పీవోకేలో వాయుసేన దాడులను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభినందించారు. మీ ధైర్య సాహసాలతో దేశం గర్విస్తోందన్నారు. పుల్వామా దాడి తర్వాత భారత్ ధీటుగా స్పందించిందని .. మీ పరాక్రమ దాడులతో యావత్ దేశం గర్విస్తోందన్నారు.