వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అపురూప కానుక: మెర్కెల్‌కు మోడీ కృతజ్ఞతలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 10వ శతాబ్దానికి చెందిన దుర్గామాతా విగ్రహాన్ని తిరిగి ఇచ్చినందుకు భారత ప్రధాని నరేంద్రమోడీ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత పురాతనమైన ఈ మహిషాసుర మర్దిని విగ్రహం జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా దేవాలయం నుంచి చోరీ కాబడి, 1990లో జర్మనీలోని లిండన్ మ్యూజియానికి చేరుకుంది.

ఇప్పుడు ఆ విగ్రహాన్ని మూడు రోజుల భారత పర్యటనకు వస్తున్న సందర్భంగా ఏంజెలా మెర్కెల్ తన వెంట తీసుకువచ్చారు. ప్రధాని మోడీతో ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చల అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత్‌కు కానుకగా ఇస్తున్నట్టు మెర్కెల్ తెలిపారు.

Modi thanks German Chancellor Angela Merkel for return of Durga statue

హైదరాబాద్ హౌస్‌లో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ఈ విగ్రహాన్ని మెర్కెల్ స్వయంగా తన చేతులతో మోడీకి అందజేశారు. ఆనందంతో విగ్రహాన్ని స్వీకరించిన ప్రధాని మోడీ ఈ విగ్రహం జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినదని ఆయన పీఎంవో ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

చెడుపై మంచి విజయానికి ఈ విగ్రహం ప్రతీక అని ఆయన అభివర్ణించారు. భారతీయులకు జర్మనీ వాసులు అందించిన అపురూప కానుకగా దీనిని పేర్కొన్నారు.

English summary
Prime Minister Narendra Modi on Monday thanked German Chancellor Angela Merkel for the return of a 10th century statue of Durga that is originally from Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X