వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త పార్లమెంట్‌పై మోదీ అనూహ్యం - అది ‘ఆత్మనిర్భర్’‌లో భాగం, ‘న్యూ ఇండియా’ సంకేతమన్న పీఎంవో

|
Google Oneindia TeluguNews

దేశరాజధాని ఢిల్లీలో కొత్తగా నిర్మించబోయే పార్లమెంట్ భవంతికి సంబంధించిన పనులు చేయొద్దని, శంకుస్థాపన కార్యక్రమం మాత్రం చేపట్టవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ప్రక్రియలో మరో అడుగు పడింది. ముందు నుంచి అనుకున్న విధంగానే ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 10న (గురువారం) సంసద్ మార్గ్ లో కొత్త పార్లమెంట్ భవంతి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అయితే దీనిపై మంగళవారం ప్రధాని కార్యాలయం ఓ అనూహ్య ప్రకటన చేసింది.

స్వాతంత్ర్యం తరువాత మొట్టమొదటి సారిగా భారత ప్రజలు తమ పార్లమెంటును నిర్మించుకునే అరుదైన అవకాశ ఇదేనని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. అంతేకాదు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఆత్మ నిర్భర్ భారత్' నినాదాన్ని కొత్త పార్లమెంట్ భవంతికి సైతం జోడించేశారు.

అమిత్ షా.. అటో ఇటో తేల్చుకో -రైతుల అల్టిమేటం -6వ రౌండ్ అజెండా -రాత్రి హైడ్రామాఅమిత్ షా.. అటో ఇటో తేల్చుకో -రైతుల అల్టిమేటం -6వ రౌండ్ అజెండా -రాత్రి హైడ్రామా

modi-to-lay-foundation-of-new-parliament-on-10-th-vision-of-atmanirbhar-bharat-pmo

''ప్రధాని మోదీచే ఈనెల 10న శంకుస్థాపన జరుపుకోనున్న కొత్త పార్లమెంట్ భవనం.. 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్'లో అంతర్భాగంగా ఉంటుంది. స్వాతంత్ర్యం తరువాత మొదటి సారిగా ప్రజల పార్లమెంట్ నిర్మితమవుతోన్న అరుదైన మైలురాయి ఇది. 2022లో 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుండగా, ఆ సమయానికి పూర్తికానున్న కొత్త పార్లమెంట్ భవంతి 'న్యూ ఇండియా'కు అవసరాలు, ఆకాంక్షలకు సరిపోయేదిగా ఉంటుంది''అని ప్రధాని కార్యాలయం మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది.

Recommended Video

Ysrcp, TDP Took U-Turn On Agri Bills | నాడు అలా.. నేడు ఇలా.. | Bharat Bandh

ఢిల్లీలోని సంసద్ మార్గ్ లో కొత్త పార్లమెంట్ భవంతి నిర్మాణాన్ని, పాత పార్లమెంట్ భవంతి లో చెట్ల నరికివేత, ఇతర పనులు చేపట్టరాదంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. కొత్తగా ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టకూడదని స్పష్టం చేసిన కోర్టు.. నూతన పార్లమెంట్​ భవన నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపనకు మాత్రం గ్రీన్ సిగ్నలిచ్చింది. రూ.971 కోట్లతో నిర్మించనున్న కొత్త పార్లమెంట్ భవంతి పనుల కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ దక్కించుకుంది.

English summary
Prime minister narendra modi will lay the foundation stone of new Parliament Building on Dec 10. New building is an intrinsic part of vision of ‘Atmanirbhar Bharat’ & will be landmark opportunity to build peoples’ Parliament after independence, one which will match needs & aspirations of ‘New India’ says PMO on tuesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X