గురువుకు పాదాభివందనం.. అద్వానీ ఆశీర్వాదం తీసుకున్న మోడీ (వీడియో)
ఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో సీట్ల సునామీ సృష్టించిన ప్రధాని నరేంద్రమోడీ బీజీపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని కలిశారు. రాజకీయ గురువు ఆశీస్సులు తీసుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి ఉదయం అద్వానీ ఇంటికి వెళ్లిన మోడీ.. ఆయనకు పాదాభివందనం చేశారు. అనంతరం పార్టీ సాధించిన సీట్లు, భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ ఏర్పాటు తదతర అంశాలపై అద్వానీతో చర్చించినట్లు తెలుస్తోంది.
#WATCH Prime Minister #NarendraModi met senior BJP leaders LK Advani and Murli Manohar Joshi, in Delhi, earlier today. pic.twitter.com/31hURsc6Mj
— ANI (@ANI) May 24, 2019
అద్వానీతో భేటీకి సంబంధించిన ఫోటోలను మోడీ ట్విట్టర్లో షేర్ చేశారు. "అద్వానీ లాంటి గొప్ప నేతలు పార్టీని బలోపతం చేయడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరువచేయడం వల్లే బీజేపీ ఈవిజయాన్ని సాధించింది" అని మోడీ ట్వీట్ చేశారు.
అద్వానీతో భేటీ అనంతరం మోడీ, అమిత్ షాలు మురళీ మనోహర్ జోషి నివాసానికి వెళ్లారు. వారిని ఆయన సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మోడీ జోషి ఆశీర్వాదం తీసుకున్నారు.
Dr. Murli Manohar Joshi is a scholar and intellectual par excellence. His contribution towards improving Indian education is remarkable. He has always worked to strengthen the BJP and mentor several Karyakartas, including me.
— Narendra Modi (@narendramodi) May 24, 2019
Met him this morning and sought his blessings. pic.twitter.com/gppfDt7KiB
గొప్ప విద్యావేత్త, మేథో సంపత్తి, సమర్థత కలిసిన నేత డాక్టర్ మురళీ మనోహర్ జోషి. భారత విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఆయన చేసిన సేవలు అమూల్యం. బీజేపీ బలోపేతానికి ఆయన ఎనలేని కృషి చేశారు. నాతో పాటు ఎంతో మంది కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు అని మోడీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.