కలిసి ఎదుగుదాం... అభివృద్ధి సాధిద్ధాం... దేశ ప్రజలకు మోడీ పిలుపు
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ ఘన విజయం సాధించారు. ఆయన నేతృత్వంలో ఎన్డీఏ కూటమి 300లకు పైగా మెజార్టీ సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. దేశ ప్రజలు మరోసారి భారత్ను గెలిపించారని అన్న ఆయన.. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదాన్ని వినిపించారు. కలిసికట్టుగా బలమైన దేశాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
"సబ్కా సాత్ +సబ్కా వికాస్ + సబ్కా విశ్వాస్ = విజయీ భారత్. అంతా కలిసి ఎదుగుదాం. కలిసి అభివృద్ధి చెందుదాం. అందరం కలిసి ధృడమైన, ఐక్య భారతదేశాన్ని నిర్మిద్దాం. మరోసారి భారత్ గెలిచింది" అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
सबका साथ + सबका विकास + सबका विश्वास = विजयी भारत
— Chowkidar Narendra Modi (@narendramodi) May 23, 2019
Together we grow.
Together we prosper.
Together we will build a strong and inclusive India.
India wins yet again! #VijayiBharat
మోడీకి విదేశీ అభినందనలు షురూ! మొదటగా శుభాకాంక్షలు చెప్పినదెవరంటే..?