మోడీకి మరో క్లీన్చిట్ ఇచ్చిన ఈసీ.. న్యూక్లియర్ వ్యాఖ్యల్లో తప్పులేదు !
ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియన్ ఆర్మీ, న్యూక్లియర్ వెపన్స్ గురించి ప్రధాని మోడీ ప్రస్తావించడంపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఈ వ్యాఖ్యలపై మోడీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయన చేసిన కామెంట్లు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా లేవని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోడ్ ఉల్లంఘనకు సంబంధించి తాజా నిర్ణయంతో కలుపుకుని ఎలక్షన్ కమిషన్ మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడం ఇది మూడోసారి.
రాజస్థాన్లోని బర్మార్లో ఎన్ని ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ పాకిస్థాన్పై ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా భారత సైన్యం, న్యూక్లియర్ వెపన్స్ గురించి ప్రస్తావించారు. పాకిస్థాన్ తన వద్ద న్యూయక్లియర్ బాంబు ఉందని బెదిరిస్తోందని, అయితే భారత్ ఆ బెదిరింపులకు భయపడదని మోడీ అన్నారు.
అయోధ్యలో ప్రతిపక్షాలపై మోడీ ధ్వజం...రామమందిర నిర్మాణంపై మాట్లాడని ప్రధాని
పాక్ అలా చేస్తే మన వద్ద న్యూక్లియర్ బాంబును దీపావళి రోజున పేల్చేందుకు దాచుకుంటామా అని పాక్పై సటైర్ వేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ ఫిర్యాదుతో ఎలక్షన్ కమిషన్ మోడీ స్పీచ్కు సంబంధఇంచి 10పేజీలతో కూడిన స్క్రిప్టును పరిశీలించింది. అందులో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు తేలకపోవడంతో ప్రధానికి క్లీన్ చిట్ ఇచ్చింది.