వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకుల నుండి డబ్బు దొంగతనం చేస్తే... ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడతారా..? రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

దేశంలో ఆర్ధిక సంక్షోభాన్ని నివారించడానకి కేంద్రానికి నిధులు ఇచ్చేందుకు ఆర్బీఐ అంగీకరించిన నేపథ్యంలోనే మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆర్ధిక సంక్షోభం పేరు మీద కేంద్రం బ్యాంకులను కొల్లగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. దీంతోపాటు ఆర్బీఐ నుండి డబ్బులు దొంగిలించారని ఆయన ధ్వజమెత్తారు. ఆర్బిఐ నుండి డబ్బులు దొంగిలించినంత మాత్రన ఆర్ధిక సంక్షోభాన్ని గాడిలో పెట్టలేరని ఆయన విమర్శలు గుప్పించారు.

మరోవైపు ప్రధానమంత్రితో పాటు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆర్ధిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదని విమర్శించారు. ఇలా బ్యాంకులను కొల్లగొట్టడం అంటే తుపాకి గాయానికి బ్యాండెడ్ వేయడం లాంటీదని అన్నారు. దీంతో పాటు ఆర్బీఐకి లూటెడ్ అనే హష్ ట్యాగ్ కూడ ఇచ్చారు.గత కొద్ది రోజులుగా నిధుల బదీలీకి సంబంధించి ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్‌కు ప్రధాని మోడీ ప్రభుత్వానికి మధ్య విభేధాలు తలెత్తిన విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా కూడ చేశారు.

 money Stealing from RBI won’t work :Rahul Gandhi

ఊర్జిత్ పటేల్ రాజీనామాతో ప్రస్థుత గవర్నర్ శక్తికాంత దాస్ నిధుల బదీలీ కోసం చర్యలు చేపట్టాడు. దీంతో ఆర్బీఐ బోర్డు నిధుల కోసం ఓ కమిటీని వేసింది. కమిటీ సిఫారుసుల మేరకు రూ. లక్ష 76వేల కోట్లు ఆర్బీఐ నుండి కేంద్రానికి బదీలీకి పంచ జెండా ఊపింది. కాగా ఆర్ధిక మాంద్యం తలెత్తిన నేపథ్యంలో మరిన్ని పోత్సాహాకాలు కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

English summary
Congress leader Rahul Gandhi today said Prime Minister Narendra Modi and Finance Minister Nirmala Sitharaman are clueless about how to solve “self created economic disaster” and that the borrowing from the RBI won’t help.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X