మాన్సూన్ అప్డేట్స్: రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవాలలో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: ఫిరోజ్పూర్, కైథాల్, ఢిల్లీ, కాన్పూర్, దాల్తోన్గంజ్ల మీదుగా రుతుపవనాలు పయనిస్తున్నాయి. ఉత్తర మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో తుఫాను కురిసే అవకాశాలున్నాయి.
ఇంటీరియర్ ఒడిశా, చత్తీస్గఢ్, విదర్భ, ఈస్ట్ మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాలలో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లో వెస్ట్ మధ్యప్రదేశ్, విదర్భలపై క్రమంగా తగ్గుతుంది.
వాతావరణ శాఖ తెలిపిన దాని ప్రకారం ఈ మాన్సూన్ సీజన్లో ఈస్ట్ రాజస్థాన్, వెస్ట్ మధ్యప్రదేశ్, విదర్భలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈస్టా రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, చత్తీస్గఢ్, ఈస్ట్ మధ్యప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, జమ్ము కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్, సిక్కిం, జార్ఖండ్, తెలంగాణ, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్ ప్రాంతం, కోస్టల్ కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు ఉంటాయి.
Recommended Video
కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.
దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.