మాన్సూన్ అప్డేట్స్: సెంట్రల్ ఇండియా వైపు నైరుతి రుతుపవనాలు
Recommended Video
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఉత్తరాది వైపు కదులుతున్నాయని, ఆ తర్వాత సెంట్రల్ ఇండియాకు వ్యాపిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అసోం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, చత్తీస్గఢ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, దక్షిణ గుజరాత్లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో 23వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య ప్రవేశించనున్నాయి.
ఈ నెల 24వ తేదీ నుంచి మాన్సూన్ సర్క్యులేషన్ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్ము కాశ్మీర్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, అసోం, మేఘాలయ, కోస్తాంధ్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, చత్తీస్గఢ్, మధ్య మహారాష్ట్ర, ఒడిశా తదితర ప్రాంతాలలో తుఫాను అవకాశాలున్నాయి. ఈ రోజు ఉదయం 11.30 గంటల నుంచి 17.30 గంటల మధ్య కురవనుంది.
తూర్పు భారత్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. కాగా, గురువారం దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం మేఘావృతంగా కనిపించింది. ఇక్కడ మినిమమ్ టెంపరేచర్ 30.9 డిగ్రీస్ సెల్సియస్గా నమోదయింది.
కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.
దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.