మోడీ 4ఏళ్ల పాలన-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే: అక్కడ 108 నుంచి 78కి బీజేపీ సీట్లు, కాంగ్రెస్కు 40 ప్లస్
న్యూఢిల్లీ: మూడున్నర దశాబ్దాల తర్వాత 2014లో పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి 2019 లోకసభ ఎన్నికలు ఎంతో కీలకం. గత నాలుగేళ్లుగా ఒకటి రెండు వైఫల్యాలు మినహా మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో జెండా పాతింది. ఇలాంటి సమయంలో వైరి పక్షాలు ఏకమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఏబీపీ - సీఎస్డీఎస్ సర్వే చేసింది. ఏయే రాష్ట్రాల్లో పరిస్థితి బీజేపీ లేదా మోడీ నాలుగేళ్ల పాలనపై ఎలా ఉంది? తిరిగి 2019లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ ఏ మేర పుంజుకుంది అనేది ఈ సర్వే ద్వారా వెల్లడించారు.
మధ్య భారత్, పశ్చిమ భారత్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది?
మధ్య భారతం, పశ్చిమ భారత దేశంలో 114 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ 70 నుంచి 78 సీట్లు గెలుచుకోనుంది. 2014లో బీజేపీ ఇక్కడ 108 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ముప్పై సీట్ల వరకు తగ్గుతున్నాయి. 2014లో యూపీఏ 10 సీట్లు గెలుచుకుంది. కానీ ఇప్పుడు 41 సీట్ల నుంచి 47 సీట్లు గెలుచుకోనుంది. ఇతరులు 2014లో ఏమీ గెలుచుకోలేదు. ఇప్పుడు 0-2 సీట్లు గెలుచుకోనున్నారు.