వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోడీ 4ఏళ్ల పాలన-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే: ఎన్డీయేకు 274, యూపీఏకు 164 సీట్లు, మోడీకి అక్కడ దెబ్బ
న్యూఢిల్లీ: మూడున్నర దశాబ్దాల తర్వాత 2014లో పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి 2019 లోకసభ ఎన్నికలు ఎంతో కీలకం. గత నాలుగేళ్లుగా ఒకటి రెండు వైఫల్యాలు మినహా మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో జెండా పాతింది. ఇలాంటి సమయంలో వైరి పక్షాలు ఏకమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఏబీపీ - సీఎస్డీఎస్ సర్వే చేసింది. ఏయే రాష్ట్రాల్లో పరిస్థితి బీజేపీ లేదా మోడీ నాలుగేళ్ల పాలనపై ఎలా ఉంది? తిరిగి 2019లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా అంటే ఈ సర్వే ద్వారా మనకు కొంత అవగాహన రానుంది.
Newest First Oldest First
ఏబీపీ సర్వే ప్రకారం.. మోడీకి క్రేజ్ కాస్త తగ్గినా దేశంలో ఇప్పటికీ మోడీ పాపులారిటీయే ఎక్కువ. 2017లో మోడీ పాపులారిటీ 44 శాతంగా ఉండగా, 2018 జనవరిలో అది 37 శాతానికి తగ్గింది. ప్రస్తుతం 34 శాతానికి పడిపోయింది. 2017 మేలో రాహుల్ గాంధీ పాపులారిటీ 15 శాతంగా ఉండగా, 2018 మే నాటికి 24 శాతానికి పెరిగింది.
మధ్య భారతం, పశ్చిమ భారత దేశంలో 114 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ 70 నుంచి 78 సీట్లు గెలుచుకోనుంది. 2014లో బీజేపీ ఇక్కడ 108 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ముప్పై సీట్ల వరకు తగ్గుతున్నాయి. 2014లో యూపీఏ 10 సీట్లు గెలుచుకుంది. కానీ ఇప్పుడు 41 సీట్ల నుంచి 47 సీట్లు గెలుచుకోనుంది. ఇతరులు 2014లో ఏమీ గెలుచుకోలేదు. ఇప్పుడు 0-2 సీట్లు గెలుచుకోనున్నారు.
గుజరాత్లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 54 శాతం ఓట్లు, యూపీఏకు 42 శాతం
ఓట్లు, ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ సర్వేలో వెల్లడైంది. 2014 సార్వత్రిక
ఎన్నికల్లో బీజేపీకి 59 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 54 రానున్నాయి. అంటే 5 శాతం
తగ్గనుంది. గుజరాత్లో కాంగ్రెస్కు 2014లో 33 శాతం రాగా, ఇప్పుడు 42 శాతం ఓట్లు
రానున్నాయి. అంటే 9 శాతం పెరిగింది.
ఏబీపీ సర్వే ప్రకారం మహారాష్ట్రలో ఎన్డీయేకు 48 శాతం, యూపీఏకు 40 శాతం, ఇతరులకు 12 శాతం ఓట్లు రానున్నాయని ఏబీపీ సర్వే తెలిపింది. 2014లో ఎన్డీయేకు 51 శాతం రాగా ఇప్పుడు 48 శాతం రానుంది. 3 శాతం ఓట్లు తగ్గనున్నాయి. అదే సమయంలో యూపీఏకు 2014లో 35 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 40 శాతం రానున్నాయి. ఐదు శాతం ఓట్లు ఎక్కువగా రానున్నాయి.
శివసేన వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కాకుండా ఒంటరిగా పోటీ చేయనుంది. అయితే శివసేనతో కలిస్తే బీజేపీకి ఎంత లాభమంటే 2014లో 27 శాతం కాగా, ఇప్పుడు 29 శాతంగా ఉంది. రెండు శాతం ఎక్కువే ఉంది. కానీ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసే అవకాశాలున్నాయి.
ఈశాన్య ప్రాంతంలో బీజేపీ హవా....
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హవా కనిపించనుందని ఈ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ 142 స్థానాలు ఉండగా ఎన్డీయే 86 నుంచి 94 మధ్య, యూపీఏ 22 నుంచి 26 సీట్లు గెలుచుకోనుందని వెల్లడించింది. ఇతరులు 26 నుంచి 30 గెలవనున్నారు. 2018లో ఎన్డీయే 58, యూపీఏ 21, ఇతరులు 61 స్థానాలు దక్కించుకున్నారు.
Comments
narendra modi bjp congress నరేంద్ర మోడీ బీజేపీ కాంగ్రెస్ mood of the nation survey mood of the nation
English summary
2019 is a crucial year and the Narendra Modi government would face the electorate. An interesting mood of the nation survey has been conducted to find out what the people feel about the existing government which completes four years.