వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏబీపీ సర్వే: మళ్లీ మోడీదే గెలుపు, బాగా పుంజుకున్న కాంగ్రెస్, ఆ రాష్ట్రాల్లో బీజేపీకి దెబ్బ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నాలుగేళ్ల పాలన నేపథ్యంలో ఏబీపీ - సీఎస్‌డీఎస్ మూడ్ ఆప్ ది నేషన్ పేరుతో సర్వే చేసిన విషయం తెలిసిందే. 2019లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసింది. ఈ సర్వే ద్వారా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు, ఏ రాష్ట్రంలో ఎవరు ముందంజలో ఉంటారో వెల్లడించింది.

మోడీ 4ఏళ్ల పాలన-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే: ఎన్డీయేకు 274, యూపీఏకు 164 సీట్లు, మోడీకి అక్కడ దెబ్బమోడీ 4ఏళ్ల పాలన-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే: ఎన్డీయేకు 274, యూపీఏకు 164 సీట్లు, మోడీకి అక్కడ దెబ్బ

2014తో పోల్చుకుంటే మోడీ హవా కొద్దిగా తగ్గినప్పటికీ ఎన్డీయేదే విజయమని తేల్చింది. రాహుల్ గాంధీ ప్రతిష్ట కొంత పెరిగినట్లుగా సర్వే వెల్లడించింది. ఎన్డీయేకు 274 సీట్లు, యూపీఏకు 164 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది.

Mood of the Nation: UPA consolidates, but Modi will return to power

రాష్ట్రాల విషయానికి వస్తే మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్‌లలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని తెలిపింది. బీహార్, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టనుంది.

ప్రాంతాల వారీగా ఓట్ షేర్ చూస్తే..

ఉత్తర భారత దేశం: ఎన్డీయే- 39%; యూపీఏ- 21%; ఇతరులు- 40%
ఈశాన్య భారతం: ఎన్డీయే- 43%; యూపీఏ- 25%; ఇతరులు- 32%
సెంట్రల్, వెస్టర్న్ ఇండియా: ఎన్డీయే- 48%; యూపీఏ- 43 %; ఇతరులు- 9%
దక్షిణ భారత దేశం: ఎన్డీయే- 18%; యూపీఏ- 38%; ఇతరులు- 44%
భారత్ మొత్తం చేస్తే ఎన్డీయే- 37%; యూపీఏ- 31%; ఇతరులు- 32%

యూపీఏలో ఎస్పీ, బీఎస్‌పీ కలిసి పోటీచేస్తే బీజేపీ బాగా నష్టపోయే అవకాశముంది. ఈరోజు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకి 35%, ఎస్పీ-బీఎస్పీ కూటమికి 46% ఓట్లు లభిస్తాయి.
గుజరాత్‌లో ఎన్డీఏకి 54%, యూపీఏకి 42%, ఇతరులకు 4% ఓట్లు దక్కే అవకాశముంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ కాంగ్రెస్‌కు 9% ఓట్లు పెరగవచ్చు. మహారాష్ట్రలో ఎన్డీఏకి 48%, యూపీఏకి 40%, ఇతరులకు 21% ఓట్లు లభించే అవకాశముంది. ఈ ఓట్ల శాతం సాధించాలంటే బీజేపీ-శివసేన కలిసి పోటీచేయాలి. దానితో సంబంధాలు కొనసాగించాలి. 2014లో ఇక్కడ ఎన్డీఏకి 51% ఓట్లు వచ్చాయి.

మధ్యప్రదేశ్‌ శానససభ ఎన్నికలు ఇప్పటికప్పుడు జరిగితే కాంగ్రెస్‌కు 49%, బీజేపీకి, 34%, ఇతరులకు 17% ఓట్లు లభించే అవకాశముంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి తృణమూల్‌కు 44%, బీజేపీకి 24%, లెఫ్ట్ పార్టీలకు 17%, కాంగ్రెస్‌కు 11% ఓట్లు దక్కవచ్చు. రాజస్థాన్‌లో బీజేపీకి ఇబ్బందే. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 44%, బీజేపీకి 39%, ఇతరులకు 17% ఓట్లు రావొచ్చు. 2013లో ఇక్కడ బీజేపీ 45%ఓట్లు దక్కించుకొంది. బీహార్‌లో బీజేపీ-జేడీయూ కూటమి పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిగినా ఈ కూటమి మంచి ఫలితాలను సాధిస్తుంది.

English summary
The 'Modi wave' continues to remain a powerful force and the NDA will form government again 2019, but the win may not be as thumping as it was in the 2014 General Elections, predicted ABP-CSDS survey. The survey predicts that the BJP and allies could bag 274 seats while Congress-led UPA may secure 164 seats. The others are expected to win 105 seats. The survey, however, comes with a disclaimer that "if the polls were held today" which means that it takes into consideration the performance of the BJP-led government in the last four years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X