భారత్కు ఎదురుదెబ్బ : రేటింగ్ బీఏఏ3కి తగ్గించిన మూడీస్, తొలిసారి నెగెటివ్లోకి
న్యూఢిల్లీ: భారతదేశానికి ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ షాకిచ్చింది. భారతదేశం యొక్క సావరిన్ రేటింగ్స్ ను బీఏఏ3కి తగ్గించింది అంతేగాక, ఇండియా ఔట్ లుక్ను 'స్టేబుల్' నుంచి (నెగెటివ్'గా మార్చింది. ఈ మేరకు మూడీస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా, కొద్ది రోజుల క్రితం ఎస్ అండ్ పీ, ఫిచ్ రేటింగ్స్ కూడా భారత రేటింగ్స్ తగ్గించిన విషయం తెలిసిందే. తాము భారతదేశం స్థానిక కరెన్సీ రేటింగ్ ను బీఏఏ2 నుంచి బీఏఏ 3కి తగ్గించామని మూడీస్ తన తాజా ప్రకటనలో వెల్లడించింది. కాగా, రెండు దశాబ్దాల్లో ఇలా తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
స్వల్పకాలిక స్థానిక కరెన్సీ రేటింగ్ కూడా పీ-2 నుంచి పీ-3కి తగ్గించారు. మూడీస్ నిర్ణయం రాబోయే కాలంలో దేశంలోని పాలసీ మేకింగ్ ఇనిస్టిట్యూషన్లకు సవాలుగా మారనుంది. వారు తీసుకున్న చర్యలను సక్రమంగా అమలు చేయడం వారికి చాలా అవసరం. ఇంకా సరైన దిశలో చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని క్రమంగా తగ్గించే అవకాశం ఉంది.
Recommended Video
కాగా,
మూడీస్..
రేటింగ్
తగ్గించడానికి
ప్రధాన
కారణం
కరోనా
వ్యాప్తి
ద్వారా
ఆర్థిక
వ్యవస్థకు
జరిగిన
నష్టం
మాత్రమే
కాదని
పేర్కొంది.
అయితే,
కరోనా
లాక్డౌన్
బారత
క్రెడిట్
ప్రొఫైల్కు
హానికరంగా
మార్చిందని
వెల్లడించింది.
కరోనా
వ్యాప్తికి
ముందే
దేశ
ఆర్థిక
ఔట్
లుక్ను
నెగెటివ్
గా
మార్చాలని
నిర్ణయించకున్నామని
పేర్కొంది.
దేశంలో
కరోనా
తర్వాత
కూడా
చాలా
కాలంపాటు
మందగించిన
వృద్ధిని
చూడాల్సి
ఉంటుందని
మూడీసీ
తెలిపింది.
2021
ఆర్థిక
సంవత్సరానికి
ఆర్థిక
వృద్ధి
రేటు
4శాతానికి
తగ్గించినట్లు
పేర్కొంది.