వర్షాలకు కుప్పకూలిన భవనం... 30పైగా శిధిలాల క్రింద... శిధిలాల్లో ఆర్మీ సైనికులు కూడ...?
హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ భవనం కుప్పకూలిపోయింది. దీంతో సుమారు ముప్పై మంది వరకు భవనం శిధిలాల క్రింద చిక్కుకున్నారు. అయితే బిల్డింగ్ శిధిలాల్లో ఆర్మీ సైనికులతోపాటు ఇతర కుటుంభాల సభ్యులు కూడ ఉన్నట్టు తెలుస్తోంది..కాగా చిక్కుకున్న వారిలో 10మంది వరకు రక్షించినట్టు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో కురుస్తున్న భారి వర్షాలకు ఓ గెస్ట్హస్ భవనం కుప్ప కూలిపోయింది. దీంతో భవనం శిధిలాల క్రింద సుమారు ముప్పైమంది వరకు చిక్కుకున్నట్టు సమాచారం. అయితే మధ్యహ్నాం రెండు గంటలకు బిల్డింగ్ కూలిన ప్రాంతంలో ఆర్మీ అధికారులు లంచ్ చేయడం కోసం వెళ్లారు. దీంతోపాటు అందులో రెండు కుటుంభాలు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కాగా ఈ సంఘటన ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగినట్టు తెలుస్తోంది.కాగా శిధిలాల చిక్కుకున్న పదిమందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించినట్టు డైరక్టర్ కమ్ రెవెన్యూ స్పెషట్ సెక్రటరీ తెలిపాడు. కాగా సహయాక చర్యలు కొనసాగుతున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు విపరీతమైన వర్షాల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కల్గుతుందని ఆయన తెలపారు. శిధిలాల నుండి బయటకు తీసిన వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.