మమతకు 6గురు ఎమ్మెల్యేల షాక్, బిజెపిలో చేరే అవకాశం
రాష్ట్రపతి ఎన్నికలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి చిక్కులు తెచ్చి పెట్టాయి.
కోల్కతా: రాష్ట్రపతి ఎన్నికలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి చిక్కులు తెచ్చి పెట్టాయి.
చదవండి: మా మద్దతు ఎన్డీయే అభ్యర్థికే: మమతా బెనర్జీకి సొంత ఎమ్మెల్యేల షాక్
మమత యూపీఏ నిలబెట్టిన మీరాకుమార్కు మద్దతు పలకడంతో త్రిపురకు చెందిన ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.
మమత మద్దతు ప్రకటించిన విపక్షాల అభ్యర్థి మీరా కుమార్కు ఓటేయడానికి త్రిపుర టిఎంసి ఎమ్మెల్యేలు ససేమీరా అంటున్నారు. ఇప్పుడు ఏకంగా వారు బిజెపిలో చేరేందుకు సిద్ధమవుతుండటం మమతకు పెద్ద షాక్ అని చెప్పవచ్చు.
మరోవైపు గురువారం అసోంలోని గౌహతిలో జరిగే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ సభకు వీరు హాజరు కానున్నారు.
త్రిపురలో అధికారంలో ఉన్న సీపీఎం మద్దతిచ్చిన విపక్షాల అభ్యర్థి మీరా కుమార్కు తాము ఓటేసేది లేదని ఆరుగురు ఎమ్మెల్యేలు ఇటీవల స్పష్టం చేశారు. గతేడాది కాంగ్రెస్ నుంచి టీఎంసీలో చేరిన వీరు.. మరోసారి జంప్ చేసేందుకు సిద్ధమయ్యారు.