ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చింది: ప్రియాంకపై ప్రశాంత్ కిషోర్
బీహార్: ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై జేడీయూ నేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భిన్నంగా స్పందించారు. ఆమె ఆరంగేట్రంపై పీకే హర్షం వ్యక్తం చేశారు. రాజకీయంగా వ్యతిరేక కూటమిలో ఉన్న ఆయన ఆమెకు అభినందనలు తెలిపారు.
భారత రాజకీయాల్లో ఎంతగానో ఎదురుచూస్తున్న ఘడియ వచ్చేసిందని, ప్రియాంక రాజకీయాల్లోకి వస్తున్న సమయం, ఆమె చేపట్టనున్న బాధ్యతలు, ఆమెస్థాయి పైన ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకునే అవకాశముందని, రాజకీయాల్లో ఎదిగేందుకు ఆమె నిర్ణయించుకున్నారని, ప్రియాంక గాంధీకి కంగ్రాట్స్ అని ట్వీట్ చేశారు.
ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా వంటి యువ నేతలను కేవలం రెండు నెలల కోసం యూపీకి పంపించడం లేదని, యూపీలో కాంగ్రెస్ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లేందుకు పంపిస్తున్నానని రాహుల్ గాంధీ చెప్పారు. మరోవైపు, రాహుల్ గాంధీ విఫలం కావడం వల్లే ప్రియాంక గాంధీ తెరపైకి వచ్చారని బీజేపీ ఇప్పటికే విమర్శలు గుప్పించింది.
One of the most awaited entries in Indian politics is finally here! While people may debate the timing, exact role and position, to me, the real news is that she finally decided to take the plunge! Congratulations and best wishes to Priyanka Gandhi.
— Prashant Kishor (@PrashantKishor) January 23, 2019