ముగ్గురు కూతుళ్లను హత్య చేసి తల్లి ఆత్మహత్య
బెంగళూరు: కుటుంబ సమస్యల కారణంగా ముగ్గురు కుమార్తెలను హత్య చేసిన తల్లి తరువాత ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలో జరిగింది. ఆర్థిక సమస్యలతో ఒకే కుటుంబంలో నలుగురు ఈ విధంగా అసువులు బాయడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ముదోళ తాలుకా మహాలింగపురం పట్టణంలోని బావికట్టి ప్రాంతంలో మాన్వికి చెందిన రాజేశ్వరి (40) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈమెకు పుష్ప (19), సాధన (15), సహన (11) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం రాజేశ్వరికి వివాహం అయ్యింది.
తరువాత మహాలింగపురం వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. 10 సంవత్సరాల క్రితం తనకు ముగ్గురు కుమార్తెలు పుట్టారు. తాను పోషించలేనని రాజేశ్వరి భర్త ఇల్లు వదలి వెళ్లిపోయాడు. తరువాత అతను తిరిగి రాలేదు. అప్పటి నుండి రాజేశ్వరి కూలి పని చేస్తు బిడ్డలను పోషిస్తున్నది.
ముగ్గురు కుమార్తెల పోషణ భారం అయ్యింది. చుట్టు పక్కల ఉన్న ఆకతాయిలు అమ్మాయిలను వేధించడం మొదలు పెట్టారు. ఈ బాధలు తట్టుకొలేని రాజేశ్వరి శనివారం వేకువ జామున ముగ్గురు కుమార్తెల గొంతు బిగించి హత్య చేసింది. తరువాత ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.