చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యానికి బానిసైన కొడుకును చంపిన తల్లి

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: మద్యానికి బానిసై డబ్బుల కోసం ప్రతి రోజూ వేదిస్తోన్న కొడుకును తల్లి హత్య చేసింది.ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ జిల్లా రాశిపురం సమీపంలోని కోనేరిపట్టికాట్టుకొట్టాయ్ లో చోటు చేసుకొంది.

తమిళనాడు లోని కొనేరిపట్టకాట్టుకొట్టాయ్ కు చెందిన అన్నాదురై అనే చేనేత కార్మికుడు ,ఆయన భార్య సుమతి పిల్లలతో కలిసి జీవిసతున్నాడు. అన్నాదురై తల్లి లక్ష్మి కూడ అదే ఇంట్లో ఉంటుంది.లక్ష్మీ లక్ష రూపాయాల చిట్టీ కడుతోంది.

mother murder her son

లక్ష్మీ భర్త లక్ష రూపాయాల చిట్టీకి సంబందించిన పది నెలల వాయిదాలను చెల్లించాడు.మిగిలిన వాయిదాలు చెల్లించలేకపోయాడు.అయితే లక్ష్మీ కష్టపడి మిగిలిన 9 నెలల వాయిదాలను చెల్లించింది. మిగిలిన ఒక్క నెల వాయిదా డబ్బులు చెల్లించాల్సి ఉంది.

ఈ చిట్టీ డబ్బులపై లక్ష్మీ కొడుకు అన్నాదురైకు ఆశ కలిగింది. మద్యానికి బానిసగా మారిన అన్నాదురై ప్రతి రోజూ తాగి వచ్చి ఈ డబ్బుల కోసం తల్లిని వేధించేవాడు.ఈ డబ్బుల కోసం తల్లిని కొట్టేవాడు.ఆదివారం రాత్రి కూడ మద్యం తాగి వచ్చిన అన్నాదురై తల్లితో తీవ్రస్థాయిలో గొడవపడ్డాడు.చిట్టీ డబ్బులు ఇవ్వాలంటూ వేదించాడు. తల్లితో గొడవపడి పడుకొన్న అన్నాదురై ని కత్తితో పొడిచి చంపింది లక్ష్మి. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

English summary
laxmi resident of koneripattikattukottayi.she has one son annadurai. laxmi live with son. annadurai had drinking habbit.laxmi have one lakh chit.annadurai wants this chits amount from his mother. everyday annadurai scoled for his mother for on lakh rupees.on sunday also son asked for monkey.when annadurai slept,laxmi murdered with a knife .police arrested laxmi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X