థెరిస్సా ఇష్యూ: బీజేపీ మీనాక్షి, నటి దియామీర్జాల మధ్య వాగ్వాదం
న్యూఢిల్లీ: థెరిస్సా సేవల ఆంతర్యం, లక్ష్యం క్రైస్తవ మతంలోకి మార్పిడిలు చేయడమేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యల పైన బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి, సినీ నటి దియామీర్జాల మధ్య బుధవారం వాగ్వాదం జరిగింది. మోహన్ భాగవత్ వ్యాఖ్యలను మీనాక్షి లేఖి సమర్థించారు.
దాని పైన దియా మీర్జా భగ్గుమన్నారు. మీనాక్షి లేఖి సమర్థనను ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆమె ఓ పోస్ట్ చేశారు. క్రైస్తవ మతంలోకి ప్రజలను తీసుకు వెళ్లడమే తన కర్తవ్యం అని ఒకానొక సందర్భంలో మదర్ థెరిస్సా చెప్పినట్లు మీనాక్షి లేఖి పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యల పైన దియా మీర్జా స్పందించారు. గర్హించాల్సిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం సిగ్గుచేటు అని ఆమె ట్వీట్ చేశారు. దానికి మీనాక్షి లేఖి కూడా ధీటుగానే స్పందించారు. వాస్తవాలను ఎదుర్కొనే సామర్థ్యం లేని వ్యక్తిగా మీరు సిగ్గుపడాలని లేఖీ తీవ్రంగా స్పందించారు.
కాగా, థెరీసాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్కు శివసేన కూడా మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన కొంత నిజమే చెప్పారని ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది. విదేశాల నుంచి మిషనరీలుగా వస్తున్న క్రైస్తవ సంస్థలు మన దేశంలో చాలామందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాయని ఆ పత్రికలో పేర్కొంది.
“@M_Lekhi:
@deespeak
Shame
on
you
for
not
having
the
robustness
to
face
the
facts
or
accept
the
truth!”
I
hang
my
head
in
shame.
—
Dia
Mirza
(@deespeak)
February
24,
2015
My
father
was
Catholic,
my
mother
is
a
Bengali,
I
was
raised
by
my
Muslim
step
father
and
I'm
married
to
a
Hindu.
I
am
Indian.
—
Dia
Mirza
(@deespeak)
February
25,
2015
ముస్లింలు కత్తితో బెదిరించి మత మార్పిడి చేస్తే, క్రైస్తవులు డబ్బు, సేవల పేరిట మతమార్పిడిలకు పాల్పడుతున్నారని ఆ శివసేన పేర్కొంది. అయితే, మనమంతా థెరిసా సేవలను గుర్తించామని, ఆమెలాగే చాలామంది కూడా సేవలందించారని, కానీ ఎలాంటి మతమార్పిడిలకు దిగలేదని సామ్నాలో పేర్కొంది.
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ రాజస్ధాన్లోని భరత్ పూర్లో జరిగిన ఎన్జీఓ కార్యక్రమంలో నిరుపేదలకు మదర్ థెరిస్సా సేవ అందించడం వెనుకున్న ప్రధాన లక్ష్యం క్రైస్తవ మత మార్పిడేనని అన్నారు. మదర్ థెరిస్సా సేవలు మంచిదే. కానీ వ్యక్తులను క్రైస్తవ మతంలోకి మార్పిడి చేయడానికి సేవను ఆధారంగా చేసుకున్నారని అన్నారు.