పోలీస్ స్టేషన్ టేబుల్ మీద చిన్నారి, పాల బుడ్డి, పక్కనే లేడీ పోలీస్, వైరల్, డీజీపీ సెల్యూట్!
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ లోని కోట్వాలి ఝాన్సీ పోలీస్ స్టేషన్ లో తీసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విధులు నిర్వహిస్తూనే తల్లిగా ఓ బిడ్డకు న్యాయం చేస్తున్న లేడీ కానిస్టేబుల్ నేడు వార్తల్లోకి ఎక్కారు. ఇలాంటి తల్లి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని స్వయంగా పోలీసు శాఖ డీజీపీ సెల్యూట్ చేస్తూ ఆమెను ప్రశంసలతో అభినందించారు.
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన అర్చనా (31)కు వివాహం అయ్యింది. అర్చనాకు 11 ఏళ్ల కుమార్తె ఉంది. ఉత్తరప్రదేశ్ లో ని పోలీసు శాఖలో అర్చనా కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తోంది. అర్చనా భర్త ప్రైవేటు కంపెనీ ఉద్యోగి, ప్రస్తుతం అర్చనా భర్త గుర్ గావ్ లో ఉద్యోగం చేస్తున్నాడు.
ఆగ్రాలో అవ్వాతాత దగ్గర అర్చనా 11 ఏళ్ల కుమార్త నివాసం ఉంటూ స్కూల్ కు వెలుతోంది. 2016లో అర్చనాను ఆగ్రా నుంచి ఝాన్సీ పోలీస్ స్టేషన్ కు బదిలి చేశారు. ప్రస్తుతం కోట్వాలి ఝాన్సీ పోలీస్ స్టేషన్ లో అర్చనా కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తోంది.
ఆరు నెలల క్రితం అర్చనా మరో చిన్నారికి జన్మనిశ్చింది. కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంగా అర్చనా ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగానికి వెళితే ఇంటిలో చిన్నారి ఒంటరిగా ఉంటుందని, ఆమెను చూసుకునే వారు ఎవ్వరూ ఉండరని భావించిన అర్చనా పాపను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది.
పోలీస్ స్టేషన్ లో పాపకు పాల బుడ్డీతో కడుపునిండా పాలు తాగించిన అర్చనా ఓ టేబుల్ మీద చిన్నారిని నిద్రపుచ్చింది. తరువాత అర్చనా తన విధుల్లో నిమగ్నం అయ్యింది. టేబుల్ మీద చిన్నారి నిద్రపోతున్న సమయంలో పక్కనే కుర్చీలో అర్చనా విధులు నిర్వహిస్తున్న సమయంలో తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో అప్ లోడ్ కావడంతో అది వైరల్ అయ్యింది.
The quintessential 21st century woman, an ace at any responsibility she is trusted with! Had a conversation with Archana this morning & ordered her transfer to Agra, closer home! The lil one brightening Jhansi Pstn, has inspired us to explore crèche options at every Police line pic.twitter.com/hx8b54Bcb5
— DGP UP (@dgpup) October 28, 2018
సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఆ ఫోటో ఉత్తరప్రదేశ్ డీజీపీ ఓపీ. సింగ్ కంటపడింది. అర్చనా వివరాలు తెలుసుకున్న డీజీపీ ఓపీ. సింగ్ వెంటనే అర్చనాను ఆగ్రాకు బదిలి చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ఆగ్రాలో అర్చనా కుటుంబ సభ్యులు చిన్నారికి తోడుగా ఉండటానికి డీజీపీ ఓపీ. సింగ్ అవకాశం కల్పించారు.
Her Husband works in Delhi, She had to care her 6 month old daughter alone in JHANSI, Such dedication towards work and Kid is appreciated 😊😊 pic.twitter.com/KFAAyaqR8s
— Troll Indian Politics (@TIP_Pradhanjii) October 29, 2018
తల్లిగా అర్చనా పాపకు న్యాయం చేస్తోందని, దానితో పాటు ప్రభుత్వ ఉద్యోగానికి న్యాయం చేస్తోందని డీజీపీ ఓపీ. సింగ్ కొనియాడారు. ఉద్యోగానికి, తల్లిగా న్యాయం చేస్తున్న ఇలాంటి అర్చనా మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచిందని, ఆమెకు సెల్యూట్ చేస్తున్నామని డీజీపీ ఓపీ. సింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అర్చనాను అనేక మంది సోషల్ మీడియాలో ప్రశంసలతో అభినందిస్తున్నారు.
Meet ‘MotherCop’ Archana posted at kotwali jhansi for whom the duties of motherhood & the department go side by side !
— RAHUL SRIVASTAV (@upcoprahul) October 27, 2018
She deserves a Salute !! pic.twitter.com/oWioMNAJub