వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగాలాండ్ సంక్షోభం:ముఖ్యమంత్రిపై ఎంఏల్ఏల తిరుగుబాటు, చివరికిలా...

తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొన్నట్టుగానే ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లో కూడ అదే తరహాలోనే రాజకీయాలు చోటు చేసుకొన్నాయి. ముఖ్యమంత్రిపై నాగా పీపుల్స్ ఫ్రంట్ కు చెందిన తిరుగుబాటు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కోహిమా:తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొన్నట్టుగానే ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లో కూడ అదే తరహలో రాజకీయాలు చోటుచేసుకొన్నాయి. ముఖ్యమంత్రి టిఆర్ జెలియాంగ్ పై అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ కుచెందిన 40 మంది ఎంఏల్ఏలు బుదవారం తిరుగుబాటు చేశారు.

అసోం రాష్ట్రంలోని కాజీరంగా ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన రిసార్ట్ కు తరలించారు. దీంతో నాగాలాండ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది.

ఎన్ సిఎఫ్ పార్టీ అధ్యక్షుడు ఘర్ హోజెలీ లీజిట్స్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు రంగం చేసుకొన్నారు.తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి.

గవర్నర్ ఆచార్యతో కలిసి సిఎం జెలియాంగ్ గురువారం ఢిల్లీ వెళ్ళారు. వీరిద్దరూ శుక్రవారం నాడు పీఎంఓ మంత్రి జితేంద్రసింగ్ , బిజెపి నేత రాంమాధవ్ , ఎంపి మాజీ సిఎం నైపూరియోతో సమావేశమయ్యారు.

గవర్నర్ ఢిల్లీ నుండి రాగానే పరిస్థితులు లీజీట్స్ కు ప్రతికూలంగా మారాయి. తిరుగుబాటు ఎంఏల్ఏలు మనసు మార్చుకొని నైపూరియోకు అండగా నిలవాలని నిర్ణయించుకొన్నారు.

జెలియాంగ్ కంటే ముందు నాగాలాండ్ సిఎం గా నైపూ రియో పనిచేశారు.2014 లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆయన సిఎం పదవిని వదులుకొన్నారు.

nagaland crisi

మున్సిఫల్ ఎన్నికల వ్యవహరంలో ప్రభుత్వానికి , నాగా గిరిజనులకు మధ్య వివాదం నడుస్తుండడంతో గత కొద్దిరోజులుగా హింసాత్మక ఘటనలతో నాగాలాండ్ అట్టుడుకుతోంది.

జెలియాంగ్ రాజీనామా చేయాలని నాగాలాండ్ ట్రైబల్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. దరిమిలా ఈ సంక్షోభం తలెత్తింది.60 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్ అసెంబ్లీలో ఎన్ పి ఎప్ కు 42 మంది ఎంఏల్ఏలున్నారు.

English summary
Around 40 rebel MLAs of Nagaland, belonging to the Naga People's Front have been camping in a luxury resort in Kaziranga, Assam, from early this morning. This even as the leadership crisis in the state has reached its climax, with current Chief Minister TR Zeliang on the verge of resignation and party president Shurhozelie Liezietsu who was supposed to take over the Chief Minister's mantle now sidelined. These 40 MLAs are likely to extend support to Neiphiu Rio.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X