చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరుణానిధి శాఖాహారిగా ఎందుకు మారారంటే: చెప్పిన కనిమొళి

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఇటీవల మృతి చెందిన కరుణానిధి శాఖాహారిగా మారడానికి కారణం ఏమిటో ఆయన కూతురు, ఎంపి కనిమొళి గుర్తు చేసుకున్నారు. అతను తాను పెంచుకున్న కుక్క మృతి తర్వాత మాంసాహారం తినడం మానేశారు.

కరుణానిధి అంతకుముందు మాంసాహారి. ఆ తర్వాత శాకాహారిగా మారారు. ఇదే విషయాన్ని కనిమొళి తాజాగా గుర్తు చేసుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఆమె, ఒకే ఒక్క ఘటన ఆయనను మాంసాహారానికి దూరం చేసిందని తెలిపారు.

Moved by dogs death, he turned vegetarian for 2 years

తన తండ్రి ఇంట్లో ఓ నల్లటి కుక్కను పెంచుకునేవారని, ఆయన ఇంట్లో ఉన్నంతసేపు అది వెన్నంటే ఉండేదని ఆమె తెలిపారు. తాను ఏది తింటే దానినే పెంపుడు కుక్కకు పెట్టేవారన్నారు. ఆ కుక్క అంటే తన తండ్రికి ఎంతో ఇష్టమని, ప్రేమ అన్నారు.

అయితే అది మరణించిన తర్వాత మాంసాహారాన్ని మానేశారని తెలిపారు. కుక్క మృతదేహాన్ని తమ ఇంటి వెనకున్న ఖాళీ స్థలంలోనే ఖననం చేశారన్నారు. అక్కడ ఓ మొక్కను నాటారని, ఇప్పుడు అది పెద్ద చెట్టుగా ఎదిగిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు.

English summary
Late DMK leader M. Karunanidhi, at one point in his life, gave up eating non-vegetarian food, in the wake of the death of his favourite dog.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X