వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కట్టలు తెంచుకున్న ఆగ్రహం: రాళ్ల వర్షం కురిపించిన వలస కూలీలు

|
Google Oneindia TeluguNews

భోపాల్: కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, సొంత గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేక, తినడానికి తిండి లేక కడుపు మంటతో ఉన్న ఆ కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో తమను సొంత గ్రామాలకు పంపాలంటూ, ఆహారం ఇవ్వాలంటూ రహదారిపై భారీ ఆందోళన చేపట్టారు.

మధ్యప్రదేశ్-మహారాష్ట్ర సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న బార్వానీ జిల్లాలోని రహదారిపైకి వేలాదిగా వచ్చిన వలస కూలీలు.. ఆగ్రహంతో రెచ్చిపోయారు. అక్కడేవున్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. తమను సొంత గ్రామాలకు పంపాలంటూ ఆందోళన చేపట్టారు.

 MP-MH Border: Migrants Throw Stones, Protest Over Food and transport

ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారే ఈ కూలీల్లో ఎక్కువగా ఉన్నారు.
కాగా, ప్రభుత్వం ప్రకటించిన శ్రామిక్ ట్రైన్లలో వెళ్లేంత ఆర్థిక స్తోమత తమకు లేదని, కాబట్టి తమను బస్సుల్లో ఇంటికి పంపించాలంటూ డిమాండ్ చేశారు.

అంతేగాక, రోడ్డు మీద వెళ్లే వాహనాలపైనా రాళ్లు విసిరారు. ఈ క్రమంలో భారీగా పోలీసులు మోహరించారు. జిల్లా కలెక్టర్ వారికి బస్సులు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో వలస కూలీలు ఆందోళన విరమించారు.

English summary
Violence erupted in the town of Sendhwa, located on Madhya Pradesh-Maharashtra border, today as thousands of migrant workers went on warpath after traffic was jammed on the National Highway 3.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X