ఎంపీ మోహన్ డెల్కర్ ముంబైలోని హోటల్ లో మృతి: ఆత్మహత్యగా అనుమానం
స్వతంత్ర ఎంపీ అయిన మోహన్ డెల్కర్ ఈ రోజు ముంబైలోని ఒక హోటల్లో అనుమానాస్పదంగా మృతి చెందారు. మోహన్ డెల్కర్, దాద్రా మరియు నగర్ హవేలీ యొక్క లోక్సభ సీటు నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ప్రాథమిక దర్యాప్తు జరిపిన పోలీసులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. 58 ఏళ్ల రాజకీయ నాయకుడు, ఇద్దరు పిల్లల తండ్రి అయిన మోహన్ డెల్కర్ మృతదేహం మెరైన్ డ్రైవ్లోని ఒక హోటల్లో దొరికింది.
మోహన్ డెల్కర్ 2019 లో పార్టీ నుండి వైదొలిగే వరకు ఆయన దాద్రా మరియు నాగర్ హవేలీలకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2004 నుండి పార్లమెంటులో దాద్రా మరియు నగర్ హవేలీలకు ప్రాతినిధ్యం వహించారు. ఏడుసార్లు ఎంపిగా పని చేసిన మోహన్ డెల్కర్ చనిపోయాడు. మోహన్ డెల్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు.మెరైన్ డ్రైవ్లోని సీ గ్రీన్ హోటల్కు పోలీసులు చేరుకున్నారు, అక్కడ మోహన్ డెల్కర్ ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు.
ఆయన బస చేసిన హోటల్ గది నుండి వారు సూసైడ్ నోట్ కూడా కనుగొన్నారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించబడింది. మోహన్ డెల్కర్ 2019 లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నుంచి తప్పుకున్నారు. గతేడాది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో భేటీ తర్వాత దాద్రా, నగర్ హవేలీలలో జరిగిన స్థానిక ఎన్నికలకు మోహన్ డెల్కర్ జెడియుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. జెడియుకు ఆయన మద్దతు ఇవ్వడం వల్ల దాద్రా, నగర్ హవేలీలలో జరిగిన స్థానిక ఎన్నికలలో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది.