సుష్మా స్వరాజ్కు టీడీపీ ఎంపీ కిడ్నీ ఆఫర్..
కిడ్నీ ఇవ్వడానికి తాను కూడా సిద్దమేనని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. ఈ మేరకు సుష్మాకు లేఖ కూడా రాశారు రాయపాటి. రాజకీయాల్లో సుష్మా మరిన్ని రోజులు సేవలు అందించాల్సిన అవసరం ఉందని, కాబట్టి
న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీ ఫెయిల్యూర్ విషయాన్ని తొలుత ట్విట్టర్ ద్వారా వెల్లడించారు సుష్మా. అప్పటినుంచి సుష్మా వ్యక్తిగత సిబ్బందికి ఫోన్ల మీద ఫోన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. దేశంలోని చాలామంది సుష్మాకు కిడ్నీ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.
తాజాగా కిడ్నీ ఇవ్వడానికి తాను కూడా సిద్దమేనని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. ఈ మేరకు సుష్మాకు లేఖ కూడా రాశారు రాయపాటి. రాజకీయాల్లో సుష్మా మరిన్ని రోజులు సేవలు అందించాల్సిన అవసరం ఉందని, కాబట్టి తన కిడ్నీని స్వీకరించాలని రాయపాటి ఆ లేఖలో ప్రస్తావించారు. శుక్రవారం నాడు సుష్మా కార్యాలయ సిబ్బందికి ఈ లేఖ అందజేశారాయన.
కాగా, ఢిల్లీ ఎయిమ్స్లో ప్రస్తుతం సుష్మా చికిత్స పొందుతుండగా.. అక్కడి వైద్య సిబ్బందికి చాలామంది దాతలు ఫోన్లు చేస్తున్నారు. ఎక్కువగా హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ల నుంచి ఎక్కువమంది దాతలు.. 'మేమంటే మేము కిడ్నీ ఇస్తామని' ముందుకొస్తున్నట్టుగా అక్కడి వైద్యులు చెబుతున్నారు.