సాధ్వీ, ప్రధానమంత్రి మోడినే చాలెంజ్ చేసింది... అసదుద్దిన్ ఓవైసీ
భోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దిన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. సాధ్యీ నేరుగా ప్రధానమంత్రి మోడీనే చాలెంజ్ చేసిందని విమర్శించారు. ఆమే ఉన్నత కులానికి చెందింది కాబట్టే అలా మాట్లాడగల్గిందని ఆయన మండిపడ్డారు. ఆమే చేసిన వ్యాఖ్యలు మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ ఎంపీగా ఎన్నికైన బీజేపీ నేత సాధ్వీ ఆదివారం తన నియోజకవర్గంలో పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలు ,పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గోన్నారు. ఈనేపథ్యంలోనే ఓ కార్యకర్త తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను సాధ్వీ దృష్టికి తీసుకువెళ్లారు. తమ ప్రాంతంలో లావెట్రీలు,డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని పిర్యాధు చేశారు. దీంతో స్పందించిన ఆమే తాను లావేట్రిలు, డ్రైనేజీలే క్లీన్ చేసేందుకు ఎంపీగా కాలేదని అన్నారు.
మేమున్నది మురికి కాలువలు మరుగుదోడ్లు క్లీన్ చేసేందుకు కాదని చెప్పారు. మేము ఎందుకు ఎన్నికయ్యామో ఆ పనులను నిజాయితీగా చేసి చూపిస్తామని చెప్పారు. దయచేసి అర్థం చేసుకోండి, నేను చేసే పని వేరే ఉంది దాన్ని పూర్తి చేస్తాను, ఇదివరకే ఈ విషయాన్ని చెప్పాను, మళ్లి చెబుతున్నాను అని తేల్చి చెప్పింది.