ఈగ ఫేం హీరో సుదీప్ తో బళ్లారి శ్రీరాములు భేటీ, మోడీ ప్రభుత్వం, లోక్ సభ ఎన్నికలు!
బెంగళూరు: బీజేపీ నిర్వహిస్తున్న సంపర్క్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా కర్ణాటక మాజీ మంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు సోమవారం బెంగళూరులో ప్రముఖ బహుబాష నటుడు, ఈగ ఫేం సుదీప్ తో భేటీ అయ్యారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా బీజేపీ సంపర్క్ సమర్థన్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ది పథకాలు, అమలు చేసిన కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఓ పుస్తకం ముద్రించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ది పథకాలు, అమలు చేసిన కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలను దేశంలోని అనేక మంది సెలబ్రిటీలకు బీజేపీ నాయకులు పంచిపెడుతున్నారు.
2019లో జరిగే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ఆ పుస్తకం ఉపయోగపడుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఆ పుస్తకాన్ని మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములు అనేక సంవత్సరాలు స్నేహితుడిగా ఉన్న బహుబాష నటుడు సుదీప్ కు అందించారు.
కర్ణాటకలో ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన బళ్లారి శ్రీరాములును గెలిపించాలని సుదీప్ ప్రచారం చేశారు. బళ్లారి సిటీలో గాలి సోమశేఖర్ రెడ్డిని. బళ్లారి గ్రామీణ నియోజక వర్గంలో సన్న పకీరప్పను గెలిపించాలని హీరో సుదీప్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, స్నేహం కోసం ప్రచారం చేశానని హీరో సుదీప్ అప్పట్లో మీడియాకు చెప్పారు.