ఫేస్ బుక్ తంటా: ఎంఎల్ఏ టికెట్ కు ఎసరు
ఉత్తరప్రదేశ్: ఫేస్ బుక్ లో తనకు ఇబ్బందులు కలిగించేలా ఉన్న ఫోటోను పోస్టు చేసిన బీఎస్పీ అభ్యర్థి టిక్కెట్ రద్దు చేస్తూ బీఎస్పీ అధినేత్రి మాయావతి కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అట్రౌలీ నియోజక వర్గం మహిళా నాయకురాలు సంగీతా చౌదరీ మాయవతి కోపానికి గురైనారు.
2017 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సంగీతా చౌదరీని పోటీ చేయించాలని పార్టీ నిర్ణయించింది. గతంలో ఇదే నియోజక వర్గం నుంచి సంగీత భర్త ధర్మేంద్ర చౌదరీ పోటీ చేశారు. అయితే గత ఏడాది జనవరి నెలలో ధర్మేంద్ర చౌదరీ హత్యకు గురైనారు.
ఈ నియోజక వర్గం నుంచి ధర్మేంద్ర భార్య సంగీత చౌదరీని పోటీ చేయించాలని మాయావతి నిర్ణయం తీసుకున్నారు. సంగీతా చౌదరీకి ఈ విషయం చెప్పడంతో ఇప్పటి నుంచి సంగీతా చౌదరీ ప్రచారం చేస్తున్నారు.
అయితే ఇటీవల సంగీత చౌదరీ, ఆమె పిల్లలు మాయావతి కాళ్లు ముక్కుతున్నట్లుగా ఉన్న ఓ ఫోటోను సంగీత ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం అయ్యింది. విషయం తెలుసుకున్న మాయావతి క్రమశిక్షణ చర్యల కింద ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఫోటో ఇలా ఉంటే తాను కచ్చితంగా గెలుస్తానని ఆ ఫోటో పెట్టానని సంగీత చౌదరీ లబోదిబో అంటున్నారు.