ఎంఎస్ ధోని మూవీ మరో నటుడి ఆత్మహత్య.. లాంగ్ సూసైడ్ నోట్.. ఏముందంటే..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్.. ఎంఎస్ ధోని ఆన్ టోల్డ్ స్టోరీ. ఈ మూవీలో ధోనీ రోల్ను సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోషించారు. అచ్చం ధోనిలాగే కనిపించారు. అయితే అంతకుముందే సుశాంత్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అదే మూవీలో నటించిన మరో నటుడు బలవన్మరణం చర్చకు దారితీసింది. దీంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఎంఎస్ ధోనీ మూవీలో నటించిన యాక్టర్ సందీప్ నహర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేశాడు. తన భార్యతో పడలేకపోతున్నానని అందులో వెల్లడించాడు. జరిగిన దానికి తన భార్యను నిందించరాదని కోరాడు. దీంతో ఆయన మనసు ఎంత స్వచ్చమైనదో అర్థమవుతోంది. ఆ తర్వాత ప్రాణాలు తీసుకున్నాడు. సందీప్ ఆత్మహత్యపై ముంబై పోలీసులు విచారణ ప్రారంబించారు.
గత ఏడాది ఎంఎస్ ధోనీ చిత్రం హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇప్పుడు అదే సినిమా నుంచి మరో నటుడు చనిపోయారు. దీంతో ఆ మూవీలో నటించిన వారికి ఏమవుతుంది అబ్బా అనే అనుమానం కలుగుతోంది. వరసగా నటుల సూసైడ్ మాత్రం సస్పెన్స్ కలిగిస్తోంది.