ఫోర్బ్స్ అథ్లెట్ బ్రాండ్ల జాబితాలో ఒకే ఒక్కడు ధోని
న్యూఢిల్లీ: ఫోర్బ్స్ మ్యాగజైన అత్యంత విలువైన అథ్లెట్ బ్రాండ్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ క్రీడాకారుడుగా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిలిచాడు. అత్యంత విలువైన 10 మంది బ్రాండ్ అధ్లెట్ల జాబితాను తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన రూపొందించింది.
మొదటి స్దానంలో అమెరికా బాస్కెట్ బాల్ క్రీడాకారుడు లేబ్రోన్ జేమ్స్ ఉండగా.. అమెరికన్ గోల్ప్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్, టెన్నిస్ క్రీడాకారులు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్లు ఆ తర్వాతి స్దానాల్లో ఉన్నారు. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 20 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఐదో స్దానంలో ఉన్నారు.
గత ఏడాది 21మిలియన్ డాలర్లతో పోల్చితే ఈసారి కాస్త తక్కువ. మొదటి స్దానంలో ఉన్న లేబ్రోన్ జేమ్స్ 37 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువ ఉండగా.. టైగర్ వుడ్స్ 36 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఉన్నారు. ఆ తర్వాతి స్దానాల్లో ఉన్న రోజర్ ఫెదరర్ 32 మిలియన్ డాలర్లతో ఉన్నారు.