అరుదైన ఫొటోషూట్: అంబానీ తనయ మోడలింగ్
ముంబై: సంపన్నుల్లో ఒక్కరైన ముకేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ ఫొటోషూట్ ముంబై నగరంలో టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. ముంబైలోని ఆంటీలియా భవనంలో ఆ అరుదైన ఫొటో షూట్ జరిగింది. వందల కోట్లు వెచ్చించిన బిల్డింగ్లో కలర్ఫుల్ లైటింగ్ మధ్య ఆ ఫొటోషూట్ జరుగుతుంది.
ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టుల నడుమ వేల కోట్లకు అధిపతి అయిన ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ మోడలింగ్ చేస్తూ ఆ షూట్లో ఫోజులిస్తున్నది. అత్యంత ధనికుడైన అంబానీ కూతురికి ఫ్యాషన్ ప్రపంచమంటే ఇష్టమని సమాచారం.
అందుకే ఇషా ఇంట్రెస్ట్తో అదే ఫీల్డ్లో రాణించాలనుకుంటోంది. అందుకే అప్పుడప్పుడు ఫ్యాషన్ షోలలో తళుక్కున మెరుస్తోంది. సైకాలజీలో గ్రాడ్యుయేట్ పొందినా ఫ్యాషన్ సైట్ను నడుపుతోంది. రిలయన్స్కు చెందిన ఫ్యాషన్ బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటోంది.
చిన్న వయసులోనే ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ధనిక వారసుల జాబితాలో చోటు సంపాదించింది. కాలేజీ స్టూడెంట్ కౌన్సిల్కు అధ్యక్షురాలిగా ఎన్నికై లీడర్షిప్ చేసిన అనుభవం కూడా సంపాదించింది. ఆ ఫొటోషూట్కు సంబంధించిన ఫొటోలు మాత్రం ఇంకా బయటికి రాలేదు.