వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండో భార్య కొడుకు కోసమే: ములాయంపై మాయావతి

|
Google Oneindia TeluguNews

లక్నో: సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌పై బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటమి భయంతోనే ములాయం రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అజమ్‌ఘర్, మెయిన్‌పురి లోకసభ స్థానాల నుంచి ములాయం సింగ్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఓటమి భయంతోనే నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారని ములాయంపై మాయావతి మండిపడ్డారు. మెయిన్‌పురిలో ములాయం సింగ్ గెలిస్తే.. అజమ్‌ఘడ్ స్థానాన్ని వదులుకుంటారని అన్నారు.

Mulayam Singh Yadav Contesting from Azamgarh to Please his Second Wife: Mayawati

మళ్లీ ఈ నియోజకవర్గం నుంచి వేరే వ్యక్తిని కాకుండా తన కుటుంబ సభ్యుడినే ములాయం పోటీకి పెడతారని మాయావతి చెప్పారు. తన రెండవ భార్యను బుజ్జగించడానికి.. ఆమె కుమారుడు ప్రతీక్ యాదవ్‌కు అజమ్‌ఘడ్ సీటును కట్టబెట్టేందుకు ములాయం సింగ్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని మాయావతి ఆరోపించారు.

ప్రభుత్వ యంత్రంగాన్ని అధికారంలో కొనసాగుతున్న సమాజ్‌వాది పార్టీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ములాయం సింగ్ యాదవ్‌కు పిచ్చాసుపత్రిలో చికిత్స అందించాలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

English summary
Attacking Samajwadi Party (SP) supremo Mulayam Singh Yadav, Bahujan Samaj Party (BSP) chief Mayawati today alleged he was contesting from Azamgarh Lok Sabha seat only to "please his second wife".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X