53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్: క్షేత్రస్థాయిలోకి పంపవద్దని వినతి
ముంబై: దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ 4200కుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం మహారాష్ట్రలో 552 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క ముంబై నగరంలోనే 456 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
కాగా,
ముంబై
నగరంలో
భారీ
సంఖ్యలో
జర్నలిస్టులు
కూడా
కరోనా
బారినపడ్డారు.
మొత్తం
170
మంది
రిపోర్టర్లు,
వీడియో
జర్నలిస్టులు,
డ్రైవర్లకు
కరోనా
పరీక్షలు
నిర్వహించగా,
53
మందికి
పాజిటివ్
అని
తేలినట్లు
సమాచారం.
అయితే,
వీరిలో
ఎవరిలోనూ
కరోనా
లక్షణాలు
కనిపించకపోవడం
గమనార్హం.
ఇది ఇలావుండగా, తమిళనాడు రాజధాని చెన్నైలోనూ ముగ్గురు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మరికొంత మంది జర్నలిస్టులకు పరీక్షలు నిర్వహించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ జర్నలిస్టుకు కూడా కరోనా సోకింది. అంతకుముందు ఆయన కమల్నాథ్ సమావేశంలో ఆయన పాల్గొనడంతో కలకలం రేగింది. జర్నలిస్టులు కరోనా బారిన పడుతుండటంతో మీడియా సంస్థల యాజమాన్యాలు ముంబైలో రిపోర్టర్లను క్షేత్రస్థాయి రిపోర్టింగ్కు పంపవద్దని ఎడిటర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ శేఖర్ గుప్తా, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ను పలువురు జర్నలిస్టులు కోరారు.
దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 17,656కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1540 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 559కు చేరినట్లు తెలిపింది. 2841 మంది కోలుకున్నారు.
Recommended Video