ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ విజువల్స్.. రిలీజ్ చేసిన జపాన్ ఎంబసీ...
ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ఫస్ట్ విజువల్స్ను అధికారులు విడుదల చేశారు. ఈ-5 సిరీస్ శింకసేన్ పేరుతో ఫోటోలను భారతదేశంలో జపాన్ రాయబార కార్యాలయం విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టుగా పిలుస్తారు. 2023లో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది. కానీ భూ సేకరణ ప్రక్రియ పూర్తవలేదు. దీంతో ప్రాజెక్టుకు ఇప్పటివరకు అంకురార్పణ జరగలేదు.
సెప్టెంబర్లో టెండర్ ప్రక్రియ నిర్వహించారు. 24వ తేదీన లార్సన్ అండ్ టుబ్రో కంపెనీ 1.08 లక్షల కోట్లకు ప్రాజెక్టును దక్కించుకుంది. టాటా ప్రాజెక్ట్స్ పోటీకి వచ్చినా పొందలేకపోయింది. ఈ టుండర్ 47 శాతం వాపి, వడోదర, గుజరాత్ నాలుగు స్టేషన్లు ఉంటుంది. సూరత్, వాపి, బిల్లిమొర, భారుహ్ మీదుగా వెళ్తుంది. 24 నదులు, 30 రోడ్ క్రాసింగ్ దాటి ప్రాజెక్టు పూర్తవుతోంది.
వాస్తవానికి ప్రాజెక్టును ప్రారంభించాలి.. కానీ మహా వికాస్ అగాడీ ప్రభుత్వం ఏర్పడటంతో ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో షెడ్యూల్ ప్రకారం 2023 వరకు పూర్తవుతుందా లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఒకవేళ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పూర్తయితే ముంబై-అహ్మదాబాద్ మధ్య దూరం 2 గంటలకు తగ్గుతుంది.