ముంబై దాడుల సూత్రధారి జకీర్ రహమాన్ లఖ్వీ అరెస్ట్.. ఎక్కడ, ఎందుకంటే..
ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీర్ రహమాన్ లఖ్వీని ఇవాళ (శనివారం) లాహోర్లో అరెస్ట్ చేశారు. ఉగ్రవాద గ్రూపులకు ఆర్థికసాయం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. నిధుల సేకరణ కోసం లఖ్వీ ఒక డిస్పెన్సరీ నిర్వహిస్తున్నారని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ (సీటీడీ) పోలీసులు వివరించారు.
పాకిస్తాన్ పంజాబ్లో లఖ్వీ నక్కి ఉన్నారని సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇన్ఫర్మేషన్తో అరెస్ట్ చేశారు. డిస్పెన్సరీ నుంచి లఖ్వీతోపాటు ఇతరులు కూడా నిధులను సేకరిస్తున్నారని విచారణలో తేలింది. ఇందులో కొంత మొత్తాన్ని లఖ్వీ తన సొంత అవసరాల కోసం కూడా వాడుకున్నారు.
ఎల్ఈటీకి చెందిన లఖ్వీ.. యూఎన్ నియమించిన వ్యక్తి అని పంజాబ్ పోలీసులు పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణ లాహోర్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ముందు జరగనుంది. 2015 ముంబై దాడి కేసులో లఖ్వీ బెయిల్పై ఉన్నారు. ఉగ్రవాద సంస్థలకు నిధుల మళ్లింపుకు సంబంధించి కౌంటర్ సీటీడీ పోలీసులు అరెస్ట్ చేశారు.