డ్యాన్స్ చేయలేదని స్నేహితుడిపైఇలా.... కారణమదేనా?
తాను చెప్పిన పాటకు డ్యాన్స్ చేయలేదనే కోపంతో మద్యం మత్తులో స్నేహితుడితో గొడవపడి అతణ్ణి కొట్టి చంపాడు. ఈ ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది. నిందితుడిని పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హజరుపర్చారు.
ముంబాయి:మద్యం మత్తులో స్నేహితుడిని కొట్టి చంపాడు ఓ వ్యక్తి.అయితే తాను కోరిన పాటకు నృత్యం చేయనందుకే మద్యం మత్తులో స్నేహితుడిపై దాడి చేయడంతో ఆయన చనిపోయాడు. ఈ ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది.
ఈ నెల 14వ, తేదిన సుబ్రబేన్ అంథేరీ లో ఈ ఘటన చోటుచేసుకొంది. అంకుష్ జాదవ్ అతని స్నేహితుడు శ్రీవథాక్థర్ లు ఇద్దరూ స్నేహితులు.
ఈ నెల 14వ, తేదిన వీరిద్దరూ పుల్ గా మధ్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న సమయంలోనే శ్రీవథాక్థర్ తన స్నేహితుడు జాదవ్ ను డ్యాన్స్ చేయాలని కోరాడు.
అయితే జాదవ్ మాత్రం తాను నృత్యం చేసేందుకు నిరాకరించాడు. దీంతో ఇద్దరి మద్య గొడవ జరిగింది. ఇద్దరూ కూడ కొట్టుకొన్నారు.అదే సమయంలో అక్కడే ఉన్న ఇతరులు స్నేహితుల మద్య గొడవను నివారించేందుకుగాను ప్రయత్నించారు.
శ్రీవథాక్థర్ ఆగ్రహంతో జాదవ్ పై దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జాదవ్ మృతి చెందాడు.
నిందితుడిపై ఐపిసి 302 సెక్షన్ ప్రకారంగా కేసు నమోదుచేశారు పోలీసులు.నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హజరుపర్చారు పోలీసులు.