వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి...ఇద్దరు మృతి,చాలామందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి గురువారం సాయంత్రం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని సహాయం కోసం వేచిచూస్తున్నారు. ఇక అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఫుట్ఓవర్ బ్రిడ్జి కూలిన ఘటనలో 35 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందులో 10 మందిని జీటీ హాస్పిటల్లో చేర్చగా... మరో ఆరుమందిని సెయింట్ జార్జ్ హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఛత్రపతి శివాజీ టర్మినస్‌లోని 1వ ప్లాట్ ఫాంతో బీటీ లేన్‌తో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి అనుసంధానమైంది.ఈ బ్రిడ్జి కూలిపోవడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ దారిలో వస్తున్న వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అంతేకాదు ఘటనలో గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించేందుకుగాను అంబులెన్స్‌లకు దారిని క్లియర్ చేయాలని కోరారు.

సిక్‌ లీవ్ పై వింగ్ కమాండర్ అభినందన్‌....ఎప్పటి వరకో తెలుసా..?సిక్‌ లీవ్ పై వింగ్ కమాండర్ అభినందన్‌....ఎప్పటి వరకో తెలుసా..?

Mumbai Footover Bridge Collapse: At Least 2 Dead,34 Injured

శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తమను కాపాడాలంటూ చిక్కుకున్నవారు కేకలు వేయడం పలువురిని కలచివేస్తోంది.

English summary
At least 23 people have been injured and several are feared to be trapped as a footover bridge outside the Chhatrapati Shivaji Maharaj Terminus (CSMT) railway station in Mumbai collapsed on Thursday evening. Police said that the injured persons are being shifted to nearby hospitals. Senior police officials, the fire brigade and a team of the National Disaster Response Force have rushed to the site of the accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X