డిప్రెషన్?: తుపాకీతో కాల్చుకుని ఏటీఎస్ మాజీ చీఫ్ ఆత్మహత్య
ముంబై: మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఆయన తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నారు. కాగా హిమాన్షు రాయ్ గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు 'మరాఠీ దినపత్రిక లోక్మఠ్' పేర్కొంది.
ఈ నేపథ్యంలో హిమాన్షురాయ్ డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అడిషనల్ డీజీగా ఉన్న హిమాన్షు ఏడాదిన్నరగా మెడికల్ లీవ్లోనే ఉన్నారు. 1988 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హిమాన్షు రాయ్.. 2013లో సంచలనం సృష్టించిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించారు.
ఈ కేసులో బాలీవుడ్ నటుడు విందు దారా సింగ్ను అరెస్ట్ చేశారు. వీటితో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ డ్రైవర్ ఆరీఫ్ కాల్పులు కేసు, జర్నలిస్ట్ జాడే హత్యకేసు, విజయ్ పాలెండే, లైలా ఖాన్ డబుల్ మర్డర్ కేసుల విచారణలో ఆయన కీలకంగా వ్యవహరించారు.