వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో అగ్ని ప్రమాదం: నలుగురి మృతి, పలువురికి గాయాలు (వీడియో)

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబైలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం నుండి ఏడుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వారం రోజుల లోపుగానే ముంబైలో రెండో సారి అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది

వాణిజ్య రాజధాని ముంబైలో గురువారం నాడు మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం వేకువ ఝామున చోటు చేసుకున్న ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు.

మరోల్‌ చర్చ్‌ రోడ్‌లోని మైమూన్‌ అపార్ట్‌మెంట్‌లో అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఏడుగురిని రక్షించారు.. 45 నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు మరణించారని అధికారులు ప్రకటించారు.

కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 29న, కమలా మిల్స్‌ కాంపౌండ్‌ ఘటన తరహాలోనే ఇక్కడ కూడా ఊపిరి ఆడకనే బాధితులు ప్రాణాలు వదిలినట్లు అధికారులు తెలిపారు.

English summary
At least four people were killed after a fire broke out on Wednesday night in a residential building in Mumbai’s Marol locality in Andheri suburb.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X