ముంబై మాల్లో భారీ అగ్ని ప్రమాదం: 3500 మంది తరలింపు, ఇద్దరు ఫైర్మెన్లకు గాయాలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మాల్లో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పొరుగునే ఉన్న 55 అంతస్తుల భవనం నుంచి సుమారు 3500 మంది ప్రజలను సురక్షితంగా బయటికి తరలించారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇద్దరు అగ్ని మాపక సిబ్బంది గాయపడ్డారు.
దక్షిణ ముంబైలోని నాగ్పాద ప్రాంతంలోని సిటీ సెంటర్ మాల్లో ఈ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే 24 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేస్తున్నాయి.
15
జంబో
ట్యాంకర్స్,
250
మంది
అగ్నిమాపక
సిబ్బంది
ఆ
ఆపరేషన్లో
పాల్గొన్నారు.
పోలీసుల
సాయంతో
పొరుగునే
ఉన్న
పెద్ద
భవనం
ఆర్కిడ్
ఎన్క్లేవ్
నుంచి
ప్రజలను
బయటకి
తరలించారు.
Recommended Video
కాగా, లెవల్ 1న అగ్ని ప్రమాదం గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ తర్వాత మంటలు తీవ్రం కావడంతో లెవల్ 3కి చేరింది. ఇక శుక్రవారం తెల్లవారుజామున 2.34 సమయానికి ఇది లెవల్ 5 అగ్రి ప్రమాదంగా మారింది. దీంతో భారీ ఎత్తున సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సుదీర్ఘంగా శ్రమించి మంటలను ఆర్పివేశాయి.