ముంబై మేయర్కు షాక్.. నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ చలాన్
ముంబై : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తేలేదంటున్నారు ముంబై పోలీసులు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించేవారికి భారీ చలానాలు విధిస్తున్న పోలీసులు తాజాగా ముంబై మేయర్కు షాకిచ్చారు. నో పార్కింగ్ ప్లేస్లో అధికారిక వాహనాన్ని నిలిపినందుకుగానీ చలానా రాసి పంపారు.
ముంబై మేయర్ విశ్వనాథ్ మహదేశ్వర్ కోల్డోన్గరి సమీపంలోని విలేపార్లే ప్రాంతంలో స్థానిక శివసేన నాయకుడితో కలిసి పర్యటించారు. ఆ సమయంలో మేయర్ అధికారిక వాహనం ఫేమస్ ఫుడ్ పాయింట్ ఎదుట నిలిపారు. ఆ ప్రాంతం ఇరుకుగా ఉండటంతో పోలీసులు దాన్ని నో పార్కింగ్ ఏరియాగా ప్రకటించి బోర్డు పెట్టారు. అయితే ఆ బోర్డు కిందే మేయర్ వాహనం నిలపడంతో పోలీసులు చలాన్ జారీ చేయకతప్పలేదు. అయితే నిబంధనలు ఉల్లంఘించినందుకు మేయర్కు ఎంత జరిమానా విధించారన్నది తెలియలేదు.
ముంబై ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు పోలీసులు గత వారం రోజులుగా చర్యలుచేపట్టారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సిగ్నల్ జంపింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, నో పార్కింగ్ ఏరియాలో వాహనాలు నిలపడం తదితర ఉల్లంఘనలకు పాల్పడే వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. గత వారం రోజుల్లోనే ముంబై ట్రాఫిక్ పోలీలు లక్షల రూపాయలు ట్రాఫిక్ చలానాల రూపంలో వసూలు చేశారు.