పబ్ ప్రమాదం: రియల్ హీరో, మూడుసార్లు ఏడంతస్తులు ఎక్కి కాపాడాడు
ముంబై: ఇటీవల ముంబైలో పబ్బులో జరిగిన ప్రమాదంలో 14 మంది చనిపోయారు. మరో యాభై అయిదు మంది గాయపడ్డారు. అయితే ఓ పోలీస్ అధికారి మాత్రం పలువురిని కాపాడారు. అది కూడా ఏడంతస్తులు పైకి పలుమార్లు ఎక్కి బాధితులను కాపాడారు.
సదరు పోలీస్ అధికారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోలీస్ అధికారి పేరు సుదర్శన్ షిండే. ప్రమాదం జరిగిన సమయంలో సంఘటన స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బందిలో ఆయన ఒకరు.
మత్తు..సెల్ఫీలు.. నిర్లక్ష్యం: ముంబై 1 అబవ్ పబ్లో దారుణానికి కారణాలు ఇవే!
కమల మిల్స్ కాంపెక్స్లోని ఏడు అంతస్తుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు వ్యాపిస్తున్నా మహిళల అరుపులు విని సుదర్శన్ వారిని కాపాడేందుకు సాహసం చేశారు.
మూడుసార్లు ఏడు అంతస్తులు ఎక్కి గాయపడ్డ ముగ్గురిని తన భుజాలపై ఎక్కించుకొని కిందకు వచ్చారు. వారినికాపాడారు.
తాను మూడో అంతస్తుకి వెళ్లగానే అక్కడ అంతా కాలిపోయి ఉందని, ఎవ్వరూ లేరనుకుని కిందికి వస్తుండగా ఓ మహిళ అరుపులు వినిపించాయని, వెంటనే ఆమెను ఎత్తుకుని బయటికి తీసుకెళ్లానని, పబ్ కావడంతో ఎక్కడ చూసినా హుక్కా, మద్యం సీసాలే ఉన్నాయని, దాంతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయని, పొగ భరించలేక కొట్టుమిట్టాడుతున్న మరో ఇద్దరిని కూడా ఇలాగే కాపాడానని అతను తెలిపారు.