తప్పిన పెను ప్రమాదం: రైల్వే ట్రాక్పై కూలిన రోడ్ ఓవర్ బ్రిడ్జి, ఇద్దరికి గాయాలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. అంధేరీ రైల్వే స్టేషన్ను ఆనుకుని ఉన్న గోఖలే రోడ్ ఓవర్ బ్రిడ్జి కొంత భాగం కుప్పకూలి ట్రాక్పై పడిపోయింది. ఆ సమయంలో రైళ్లేవి ఆ మార్గంలో రాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఘటన జరిగిన వెంటనే పశ్చిమ లైన్పై రైళ్ల రాకపోకను అధికారులు నిలిపివేశారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. శకలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం బ్రిడ్జిపై ట్రాఫిక్ను నిలిపివేసిన అధికారులు.. సహాయక చర్యలు ప్రారంభించారు. తూర్పు-పశ్చిమ అంధేరీలను కలుపుతూ గోఖలే బ్రిడ్జిని నిర్మించారు. ఘటనలో ఇప్పటిదాకా ఇద్దరికీ గాయాలైనట్లు అధికారులు చెబుతున్నారు.
Part of Road Over Bridge (ROB), collapsed on tracks near Andheri Station towards Vile Parle on South end. Over Head Equipment (OHE) damaged. Traffic on all lines held up: Western railway PRO pic.twitter.com/1BABotFssi
— ANI (@ANI) July 3, 2018
ప్రస్తుతం శకలాల తొలగింపు కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ వంతెన కూలినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత సంవత్సరం ముంబై ఎల్ఫిన్స్టోన్ రైల్వేస్టేషన్లోని పురాతన ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు.