సెల్యూట్ టు ముంబై పోలీస్: నాలుగు రోజుల్లో ఒక్కరూ డుమ్మా కొట్టలేదట!
ముంబై: ముంబైలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. నాలుగు రోజులుగా ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షానికి మునకేసిందా మహానగరం. జనజీవనం పడకేసింది. ఇంట్లో నుంచి అడుగు బయటికి పెట్టలేని పరిస్థితి నెలకొంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలు వర్షపు నీటితో మోకాలిలోతు మునిగి తేలుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలకు సెలవులకు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. లోకల్ రైళ్లు డిపోలకే పరిమితం అయ్యాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ముంబై పోలీసులు విధులను నిర్వర్తిస్తున్నారు.
సోనియా మార్క్ పాలిటిక్స్: జనంలోకి కాంగ్రెస్..దేశవ్యాప్తంగా పాదయాత్రలు!
Hero of the Season. #MumbaiRains pic.twitter.com/DL3GRJxrQj
— Godman Chikna (@Madan_Chikna) September 4, 2019
వర్షపు నీటి కారణంగా రోడ్లపై స్తంభించిపోయిన వాహనాల రాకపోకలను నియంత్రించడంలో వెనుకాడట్లేదు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయట్లేదు ముంబై ట్రాఫిక్ విభాగం పోలీసులు. వర్షానికి తడవకుండా జర్కిన్లను ధరించి, విధుల్లో పాల్గొంటున్నారు. ముంబైలో భారీ వర్షాలు ఆరంభమైనప్పటి నుంచీ ఏ ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా విధులకు గైర్హాజరు కాలేదని, ఎప్పట్లాగే విధులను నిర్వర్తిస్తున్నారని ముంబై మహా నగర ట్రాఫిక్ విభాగం అధికారులు వెల్లడించారు. నగరం వ్యాప్తంగా మోహరింపజేసిన జాతీయ విపత్తుల నిర్వహణ బలగాలకు సహాయ, సహకారాలను సైతం అందజేస్తున్నారని అన్నారు.
Beautifully captured ❤️
— व्यंग्यपुराण ツ (@VyangyaPuraan) September 4, 2019
ముంబై రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీటిని తొలగించడంలో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించడానికీ ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వెనుకాడట్లేదని, రోడ్లపై కొట్టుకు వచ్చిన చెత్తా, చెదారాన్ని తొలగిస్తూ వాహనాల రాకపోకలు సజావుగా సాగడానికి నిరంతరం కృషి చేస్తున్నారని ముంబై ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు తెలిపారు. ముంబై రోడ్లపై నిదాదాపు అయిదడగుల మేర వర్షపు నీరు నిలిచిన కుర్లాలోని బైల్ బజార్, క్రాంతినగర్ నుంచి 1300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతానికి ఆనుకుని ప్రవహించే మిట్టీ నదిలో ఎప్పుడూ లేనివిధంగా వరద నీరు ప్రవహిస్తోంది.
Mumbai Police is a Hero any session.
— chef 👨🍳 (@indianchef30) September 4, 2019
ముంబై ట్రాఫిక్ పోలీసుల సేవలను నెటిజన్లు, ట్విట్టరెటీలు ప్రశంసిస్తున్నారు. నాలాసపోరా ప్రాంతంలో భారీ వర్షంలో విధులను నిర్వర్తిస్తోన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫొటోను ఓ ట్విట్టరెట్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ గా మారింది. దాదాపు అయిదడగుల మేర వర్షపు నీరు నిలిచిన కుర్లాలోని బైల్ బజార్, క్రాంతినగర్ నుంచి 1300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతానికి ఆనుకుని ప్రవహించే మిట్టీ నదిలో ఎప్పుడూ లేనివిధంగా వరద నీరు ప్రవహిస్తోంది. అసలు ఇక్కడ ఇలాంటి నది ఒకటుందనే విషయాన్ని ఎప్పుడో మరచేపోయామని, అలాంటి నది ఇప్పుడు వరద ప్రవాహంతో పొంగిపోర్లుతోందని స్థానికులు చెబుతున్నారు. సమీపంలోని సియోన్ రైల్వేస్టేషన్ పూర్తిగా నీటిలో మునిగింది.
Have to give it to Mumbai traffic Police! Managing traffic under any circumstances!
— adVenture (@letschull) September 4, 2019
Police chahe kahin ki bhi ho but mere liye every policemen is a big hero and thats why I also want to be a police inspector @Aadishakti_101 @AgerwalNidhhi @sapnamadan @Nilzrav
— Jatin kumar (@devil140395) September 5, 2019
Niicceee
— Old Monk (@smilinboi420) September 4, 2019