అత్యధికంగా ధనవంతులున్న సిటీ ముంబాయి, హైద్రాబాద్ లో అతి తక్కువ
ముంబాయి నగరం అత్యధికంగా ధనవంతులున్న నగరంగా ఓ సర్వే నివేదిక వెల్లడిస్తోంది. ముంబాయి తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగుళూరు నగరాలు నిలిచాయి.
న్యూఢిల్లీ:దేశంలోని ముంబాయి నగరంలోనే అత్యధిక ధనవవంతులున్న నగరంగా ప్రసిద్దిచెందింది.దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ గా విరాజిల్లుతున్న ముంబాయి ప్రస్తుతం రిచెస్ట్ ఇండియన్ సిటీగా రికార్డులకెక్కింది. ఈ మేరకు ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో అత్యధిక ధనవంతులున్న సిటీగా తేలింది.
దేశంలోనే అత్యధిక ధనవంతులున్న ప్రాంతంగా ముంబాయి రికార్డులకెక్కింది. 28 మంది బిలీయనీర్లు, 46 వేల మంది మిలీయనీర్లు ఉన్నారు.820 బిలియన్ డాలర్లతో రిచెస్ట్ సిటీగా నిలిచింది. ఈ నివేదిక ప్రకారంగా రూ.54,64,340 కోట్లతో ముంబాయి నగరం ధనవంతుల జాబితాలోకి చేరింది.
ముంబాయి తర్వాత స్థఆనంలో ఢిల్లీ, బెంగుళూరు సిటీలు నిలిచాయి.డిల్లీలో 23 వేల మంది మిలినీయర్లు, 18 మంది బిలీయనీర్లు ఉన్నారు.అయితే మొత్తం 450 బిలియన్ డాలర్లు (రూ.29,98,723) పైగా ఉన్నట్టు రిపోర్టు తెలిపింది.
బెంగుళూరు మొత్తం సంపద 320 బిలియన్ డాలర్లు (రూ.21,32,425) రిపోర్టు తెలిపింది. ఈ జాబితాలో హైద్రాబాద్ కు 9 వేల మంది మిలియనీర్లు, ఆరుగురు బిలియనీర్లు ఉన్నారని ఆ సంస్థ తేల్చింది.
దేశ వ్యాప్తంగా ఉన్న సంపద డిసెంబర్ 2016 నాటికి 6.2 ట్రిలియన్ డాలర్లను తాజా రిపోర్ట్ వెల్లడించింది. స్థానిక ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐటీ రియల్ ఏస్టేట్ హెల్త్ కేర్, మీడియా రంగాల బలమైన వృద్దితో భారత్ సంప మరింత పెరగనుందని రిపోర్ట్ వివరించింది. ముఖ్యంగా స్థానిక హస్పిటల్ సర్వీసెస్ హెల్త్ ఇన్సూరెన్స్ రంగాల్లో వృద్ది చాలా బాగుంటుందని పేర్కొంది.