16 ఏళ్ళ బాలుడిపై 8 మంది ఏడాదిగా అసహజ శృంగారం
16 ఏళ్ళ బాలుడిని బ్లాక్మెయిల్ చేస్తూ ఏడాదిగా తోటి బాలురే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముంబైలోని అంధేరిలో చోటుచేసుకొంది. ఈ మేరకు డీఎన్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది.
ముంబై: 16 ఏళ్ళ బాలుడిని బ్లాక్మెయిల్ చేస్తూ ఏడాదిగా తోటి బాలురే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముంబైలోని అంధేరిలో చోటుచేసుకొంది. ఈ మేరకు డీఎన్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది.
2016లో బాలుడి ఇంటి పక్కనే ఉండే మరో బాలుడు అత్యాచారం జరుపుతూ వీడియో తీశాడు. అనంతరం ఈ వీడియోను అతని స్నేహితులకు షేర్ చేశాడు. ఆ వీడియోను చూపి బ్లాక్మెయిల్ చేస్తూ తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేయడం ప్రారంభించారు.
బాలుడిని నిర్మానుష్య స్థలానికి తీసుకెళ్ళి ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడేవారు. నిందితుల్లో ఒకరు బాలుడిని రెస్టారెంట్ వెళ్ళి తినడానికి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు.
అయితే బాధితుడు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో నిందితులు జూన్ 26న, మరోసారి అత్యాచారం జరిపాడు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేకపోయాడని సమాచారం.
నిందితుల నుండి తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తే తీవ్రంగా కొట్టేవారని బాలుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అసహజసిద్దమైన లైంగిక చర్యలకు పాల్పడిన 15 మంది బాలురిపై పోలీసులు పిల్లల సంరక్షణ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు.
నిందితుల్లో 8 మందిని అదుపులోకి తీసుకొన్నట్టు డీఎన్ నగర్ పోలీసులు తెలిపారు. నిందితులంతా 15 నుండి 17 ఏళ్ళ లోపు వయస్సు వారేనని పోలీసులు చెప్పారు. అయితే తీవ్రమైన కడుపునొప్పితో బాధితుడు ఇబ్బందిపడుతూ స్నేహితుడికి ఈ విషయాన్ని చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.