వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగారమే: ఉల్లిగడ్డలు ఎత్తుకెళ్లిన దొంగలు

|
Google Oneindia TeluguNews

Mumbai shop burgled of onions worth Rs 18k
ముంబై: పెరిగిన ధరలతో ఉల్లిపాయలు.. బంగారం అంత విలువైన వస్తువులుగా మారాయనడానికి నిదర్శనంగా ముంబైలో జరిగిన ఈ ఘటనను చెప్పుకోవచ్చు. ముంబై నగరంలోని ఉల్షన్‌నగర్ ఇందిరా గాంధీ మార్కెట్‌లో బుధవారం తెల్లవారుజామున 18వేల రూపాయల విలువైన 260 కిలోల ఉల్లిపాయల దొంగతనం జరిగింది.

బుధవారం దుకాణం వద్దకు చేరుకున్న యజమాని ఇశార్దాస్ ఆచార దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆచార ఫిర్యాదు చేశాడు. తన దుకాణం షెటర్‌ను పగలగొట్టిన దొంగలు షాపులోని ఐదు గోనె సంచుల్లో నిల్వ చేసిన ఉల్లిపాయలను ఎత్తుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే అతని ఫిర్యాదును లైట్‌గా తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.

తన దుకాణంలో ఉన్న ఏ ఇతర సామాగ్రిని ముట్టుకోని దొంగలు ఆ ఐదు ఉల్లిపాయల సంచులను మాత్రమే దొంగతనం చేశారని ఇశార్దాస్ ఆచార చెప్పారు. పక్కనే ఉన్న ఆలుగడ్డల సంచులను దొంగలు ముట్టుకోలేదని ఆయన తెలిపారు. ఉల్లిపాయలను 65 రూపాయలకు కొనుగోలు చేసిన యజమాని 70 రూపాయలకు అమ్మాలనుకున్నట్లు తెలిపారు.

అయితే ఉల్లిపాయల కంటే చాలా తక్కువగా కిలోకు 20 రూపాయలు ఉండడంతో దొంగలు ఆలుగడ్డలను ఎత్తుకెళ్లలేదేమో అని ఆచార తెలిపారు. దుకాణ యజమాని నుంచి ఫిర్యాదు స్వీకరించామని, దొంగతనంపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకున్న తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశోక్ సాక్పల్ తెలిపారు.

English summary
Onions seem to be worth their weight in gold. Thieves escaped with 260 kg of onions worth Rs 18,000 from a shop at Indira Gandhi Market in Ulhasnagar early on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X