వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలు నుంచి తప్పించుకున్నాడు.. చివరకు రైలు కింద పడి..!

|
Google Oneindia TeluguNews

యూపీ : జైలు నుంచి తప్పించుకున్నాడు. కానీ, మృత్యువు వెంటాడుతోందనే విషయం గ్రహించలేకపోయాడు. జైలు గోడలు దూకే క్రమంలో ఓ ఖైదీ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇటావా జిల్లా జైలులో ఇద్దరు ఖైదీలు వేర్వేరు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. అయితే చాలాకాలంగా జైలు నుంచి పారిపోవాలని వారిద్దరు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

ఆ క్రమంలో ఆదివారం నాడు ఇద్దరు ఖైదీలు జైలు గోడలు దూకారు. అందులో ఒకడు పారిపోగా, మరొకడు మాత్రం రైలు పట్టాల మీద పడి ప్రాణాలు కోల్పోయాడు. రమానంద్, చంద్రప్రకాశ్ అనే ఇద్దరు ఖైదీలు మర్డర్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. అయితే చంద్రప్రకాశ్ జైలు గోడలు దూకి పారిపోగా.. రమానంద్ మాత్రం ఆ జైలు గోడల పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పైకి దూకాడు. అదే సమయంలో అటుగా రైలు రావడంతో దానికింద పడి చనిపోయాడు.

రూల్స్ పాటించండి.. లేదంటే 23 వేల ఫైన్ కట్టండి.. ఎక్కడో తెలుసా?రూల్స్ పాటించండి.. లేదంటే 23 వేల ఫైన్ కట్టండి.. ఎక్కడో తెలుసా?

Murder Convict Escape from jail But Gets Run Over by Train

వారిద్దరూ పారిపోయారనే విషయం జైలు అధికారులకు కూడా చాలాసేపటివరకు తెలియదు. అయితే ఖైదీలను కౌంట్ చేసే సమయంలో ఆ ఇద్దరు మిస్ అయినట్లు గుర్తించారు. అనంతరం రైల్వే పోలీసుల సమాచారం మేరకు రమానంద్ మృతి చెందినట్లు జైలు అధికారులకు తెలిసింది. పరారీలో ఉన్న చంద్రప్రకాశ్ అనే ఖైదీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు.

English summary
Two inmates at Uttar Pradeshs Etawah jail escaped in the wee hours of Sunday but one of them was run over by a train, officials said.Ramanand, who had been serving a life term after being convicted for murder, got run over by a train while he was trying to board it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X