జైలు నుంచి తప్పించుకున్నాడు.. చివరకు రైలు కింద పడి..!
యూపీ : జైలు నుంచి తప్పించుకున్నాడు. కానీ, మృత్యువు వెంటాడుతోందనే విషయం గ్రహించలేకపోయాడు. జైలు గోడలు దూకే క్రమంలో ఓ ఖైదీ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఇటావా జిల్లా జైలులో ఇద్దరు ఖైదీలు వేర్వేరు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. అయితే చాలాకాలంగా జైలు నుంచి పారిపోవాలని వారిద్దరు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
ఆ క్రమంలో ఆదివారం నాడు ఇద్దరు ఖైదీలు జైలు గోడలు దూకారు. అందులో ఒకడు పారిపోగా, మరొకడు మాత్రం రైలు పట్టాల మీద పడి ప్రాణాలు కోల్పోయాడు. రమానంద్, చంద్రప్రకాశ్ అనే ఇద్దరు ఖైదీలు మర్డర్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. అయితే చంద్రప్రకాశ్ జైలు గోడలు దూకి పారిపోగా.. రమానంద్ మాత్రం ఆ జైలు గోడల పక్కనే ఉన్న రైల్వే ట్రాక్పైకి దూకాడు. అదే సమయంలో అటుగా రైలు రావడంతో దానికింద పడి చనిపోయాడు.
రూల్స్ పాటించండి.. లేదంటే 23 వేల ఫైన్ కట్టండి.. ఎక్కడో తెలుసా?
వారిద్దరూ పారిపోయారనే విషయం జైలు అధికారులకు కూడా చాలాసేపటివరకు తెలియదు. అయితే ఖైదీలను కౌంట్ చేసే సమయంలో ఆ ఇద్దరు మిస్ అయినట్లు గుర్తించారు. అనంతరం రైల్వే పోలీసుల సమాచారం మేరకు రమానంద్ మృతి చెందినట్లు జైలు అధికారులకు తెలిసింది. పరారీలో ఉన్న చంద్రప్రకాశ్ అనే ఖైదీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు.