ముర్తల్ గ్యాంగ్ రేప్: సీల్డ్కవర్లో హైకోర్టుకు నివేదికిచ్చిన హర్యానా, ఏముంది?
చంఢీఘఢ్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముర్తల్ గ్యాంగ్ రేప్ ఘటనపై హర్యానా ప్రభుత్వం కోర్టుకు తుది నివేదికను అందించింది. సీల్డ్ కవర్లో దర్యాప్తు వివరాలను హర్యానా ప్రభుత్వం కోర్టుకు అందించింది. ఈ మేరకు గురువారం నాడు హర్యానా, పంజాబ్ హైకోర్టు బెంచ్కు ప్రభుత్వం ఈ నివేదికను అందించింది.
ప్రియుడితో రాసలీలలు: భర్త చూశాడని చంపి సెప్టిక్ ట్యాంక్లో, 3 హత్యలు, 15 ఏళ్ళ తర్వాతిలా..
ముర్తల్లో చోటు చేసుకొన్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2016 ఫిబ్రవరిలో ఈ ఘటన చోటు చేసుకొంది. దేశ వ్యాప్తంగా ఈ ఘటన ఆ సమయంలో కలకలాన్ని రేపింది.
దారుణం: తండ్రిని అడ్డుపెట్టి కూతురిపై అత్యాచారం, నగ్న ఫోటోలు, వీడియోలతో ఇలా..
జాట్ రిజర్వేషన్ల ఆందోళన సందర్భంగా ముర్తల్ వద్ద గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఆ సమయంలో జాతీయ మీడియాలో పలు పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి.
శాడిస్ట్ మొగుడు: 'ఆ విషయం లీక్ చేసిందనే శైలజపై దాడి'
ముర్తల్ గ్యాంగ్రేప్పై సీల్డ్ కవర్లో నివేదిక
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముర్తల్ గ్యాంగ్ రేప్ ఘటనపై హర్యానా ప్రభుత్వం సీల్డ్ కవర్లో తుది నివేదికను రూపొందించింది. సీల్డ్ కవర్లో దర్యాప్తు వివరాలను గురువారం పంజాబ్ హరియానా హైకోర్టు బెంచ్కు సమర్పించింది. ఈ నివేదికతోపాటు దాడులు, ఆ సమయంలో దాఖలైన ఇతర కేసులకు సంబంధించి కేసు డైరీలను ప్రభుత్వం కోర్టుకు అందించింది.
మీడియా కథనాల ఆధారంగా
2016 ఫిబ్రవరిలో జాట్ రిజర్వేషన్ల ఆందోళన సందర్భంగా ముర్తల్ వద్ద మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకొన్నాయని ఓ జాతీయ చానెల్ ప్రసారం చేసింది. ఈ ఛానెల్ ప్రసారం చేసిన కథనాలతో ఈ కేసును హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ దర్యాప్తు చేపట్టింది. ఇక తదుపరి విచారణను జనవరి 2018కి వాయిదా వేసింది.
స్వయంగా ఫిర్యాదు చేయాలని
ఛానెల్ లో ప్రసారమైన కథనాల ఆధారంగా ఈ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. అయితే బాధితులు స్వయంగా ఫిర్యాదు చేయాలని కోర్టు ఆ సమయంలో ఆదేశించింది. అయితే ఈ ఘటనపై 2016 ఏప్రిల్లో ఎఫ్ఐఆర్ రిజిష్టర్ చేశారు హర్యానా పోలీసులు.
ఆ సీల్డ్ కవర్లో ఏముంది
2016 ముర్తల్ గ్రామంలో మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకొన్నాయా.. ఓ జాతీయ చానెల్ ఆనాడు ప్రసారం చేసినట్టుగా పలు చోట్ల మహిళల లో దుస్తులు లభ్యమైనట్టు ప్రకటించింది. అంతేకాదు పలువురు మహిళలపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఆ ఛానెల్ ప్రకటించింది. అయితే ఈ ఘటనపై హర్యానా ప్రభుత్వం హైకోర్టుకు ఏం నివేదిక ఇచ్చిందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. అయితే సీల్డ్ కవర్లో ఈ నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. అల్లర్లకు సంబంధించి మొత్తం 8 జిల్లాల్లో 2,100 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి.